Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల ముక్కోణపు టీ20
ముంబయి : టీమ్ ఇండియాపై వరుస విజయాల జోరుమీదున్న ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ బ్రేక్ వేసింది. ముంబయిలో శుక్రవారం జరిగిన ముక్కోణపు టీ20 రెండో లీగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా హేన్స్ (65), హీలే (31) మెరుపులతో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాట్స్వుమెన్ నటాలీ సీవర్ (68, 43 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు), టామీ బ్యూమాంట్ (58, 44 బంతుల్లో 8 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీలతో చెలరేగటంతో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేరుకున్నది. మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం జోడించిన నటాలీ, టామీలు ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికారేశారు.