Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లే ఆఫ్స్ దిశగా నైట్రైడర్స్ ముందడుగు
- రాజస్థాన్పై ఘన విజయం
నవతెలంగాణ-కోల్కత
కోల్కత ఓ అడుగు ముందుకేసింది. రాజస్థాన్ రాయల్స్పై మెరుపు విజయంతో ప్లే ఆఫ్స్కు చేరువైంది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (41 నాటౌట్, 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఓపెనర్ క్రిస్ లిన్ (46, 42 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో రాజ స్థాన్ రాయల్స్పై కోల్కత నైట్రైడర్స్ ఆరు వికెట్ల తేడా తో గెలుపొందింది. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/20) మాయాజాలంతో తొలుత రాజ స్థాన్ను 142 పరుగులకే కుప్పకూల్చిన కోల్కత.. స్వల్ప ఛేదనను మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. ఈ విజయంతో 14 పాయింట్లతో కోల్కత పాయింట్ల పట్టికలో నాల్గో స్థానంలో నిలిచింది.
కుల్దీప్ మాయ : తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ ఇన్నింగ్స్లో రెండో ఓవర్ నుంచి మొదలైంది పరుగుల సునామీ. ప్రసిద్ కృష్ణ ఓవర్లో రాహుల్ త్రిపాఠి వరుసగా 6, 4, 4, 4తో విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. తర్వాత శివం మవి వేసిన ఓవర్లో జోశ్ బట్లర్ విశ్వరూపమే చూపిం చాడు. వరుసగా 4, 6, 4, 4, 6, 4తో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. ఓపెనర్లిద్దరూ టాప్ గేర్లో దూసుకెళ్తుండటంతో రాజస్థాన్ భారీ స్కోరు సాధించటం ఖాయంగా కనిపించింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రాహుల్ను అవుట్ చేసిన రస్సెల్ మ్యాచ్ గమనాన్ని మలుపు తిప్పాడు. తర్వాత వచ్చిన రహానె (11)ను రివర్స్ స్వీప్ ఆడబోయిన జోశ్ బట్లర్ను కుల్దీప్ డగౌట్కు చేర్చాడు. యువ ఆటగాడు సంజూ శాంసన్ (12)ను సునీల్ నరైన్ పడగొట్టగా, స్టువర్ట్ బిన్ని (1)ని, బెన్ స్టోక్స్ (11)ను కల్దీప్ వెనక్కి పంపాడు. ఆరంభం లో వరుస బౌండరీలతో దుమ్మురేపిన రాజస్థాన్.. తర్వాత వరుస వికెట్లతో డీలా పడిపోయింది. వేగంగా పుంజుకున్న కోల్కత బౌలర్లు రాజస్థాన్ను 142 పరుగులకే కుప్పకూల్చారు. రాజస్థాన్ ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి (27, 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), జోశ్ బట్లర్ (39, 22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు)లు తొలి వికెట్కు 4.5 ఓవర్లలోనే 63 పరుగులు అందించారు. కానీ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లలో ఎవ్వరూ రాణించలేకపోయారు. దీంతో రాయల్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ సీజన్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన కుల్దీప్ యాదవ్ (4/20) రాయల్స్పై పంజా విసిరాడు. ప్రసిద్ కృష్ణ (2/35), రస్సెల్ (2/13) ఆకట్టుకున్నారు.