Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ కేసులో అమీకస్ క్యూరీ
న్యూఢిల్లీ : బీసీసీఐ సంస్కరణల పర్వంలో 12 రాష్ట్ర క్రికెట్ సంఘాలు చేసిన కీలక సూచనలను సుప్రీంకోర్టు అమీకస్ క్యూరీ (కోర్టు సహాయకుడు) తిరస్కరించారు. ఈ మేరకు బుధవారం అమీకస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియం సుప్రీంకోర్టుకు కొన్ని అభ్యంతరాలను సముచితంగా భావించి, సిఫారసులతో కూడిన నివేదనను అందజేశారు. ఇందులో భాగంగా సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుల సంఖ్యను 3 నుంచి 5కు పెంచుకునేందుకు అంగీకారం తెలిపారు. సెలక్టర్ల సంఖ్యను పెంచాలనటం సముచితమైనదే. సెలక్షన్ కమిటీ సభ్యులకు ఉండాల్సిన అర్హతలకు లోబడి ఐదుగురిని నియమించ వచ్చు. ఇక రైల్వేస్కు బీసీసీఐ శాశ్వాత సభ్యత్వ హౌదా ఇవ్వచ్చు. భారత్కు ఆడుతున్న మహిళా క్రికెట ర్లలో 90 శాతం మంది రైల్వేస్ క్రీడాకారులే. వారి భాగస్వామ్యం ఎంతో ఉంది. అందుకే పూర్తి సభ్యత్వానికి రైల్వేస్కు అర్హత ఉంది. ఇదే సమయంలో సర్వీసెస్, నేషనల్ క్రికెట్ క్లబ్, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ యూనివర్శిటీలకు పూర్తి సభ్యత్వం అక్కర్లేదని అమీకస్ క్యూరి నివేదికలో పేర్కొన్నారు. ఇదే విధంగా రాష్ట్ర సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసిన ఒక రాష్ట్రం-ఒక ఓటు, పదవి కాలాల మధ్య విరామం సమయం నిబంధనలను యథావిథిగా అమలు చేయవచ్చని అమీకస్ క్యూరీ నివేదికలో పొందపరిచారు. 2016 జులై 18న సుప్రీంకోర్టు బీసీసీఐ సంస్కరణల పర్వంపై తీర్పు వెలువరించినా బోర్డు ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర సంఘాల అభ్యంతరాలతో ఇంకా అమలుకు నోచుకోని సంగతి తెలిసిందే.