Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నైపై డెర్డెవిల్స్ ఘన విజయం
- రాణించిన విజయ్, హర్షల్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
లీగ్ దశలో జరుగుతున్న తొలి నామమాత్రపు మ్యాచ్లో ఢిల్లీ డెర్డెవిల్స్ మురిసింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 34 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 163 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన చెన్నైకి అంబటి రాయుడు (50, 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీతో విజయాన్ని అందించేలా కనిపించాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ నిరాశపరచటంతో రాయుడు పోరాటం వృథా అయ్యింది. వాట్సన్ (14), సురేశ్ రైనా (15), ధోని (17)లు నిరాశపరిచారు. ఆఖరి ఓవర్లో 39 పరుగులు అవసరం కాగా.. చెన్నై ఓటమి ముందే ఖరారైంది. రవీంద్ర జడేజా (27) పరిస్థితికి అనుగుణంగా పరుగులు రాబట్టలేకపో యాడు. దీంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో 128/6 పరుగులే చేయగల్గింది. అంతకముందు రిషబ్ పంత్ (38, 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), విజరు శంకర్ (36 నాటౌట్, 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు), హర్షల్ పటేల్ (36 నాటౌట్, 16 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్లు) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు చేరుకోగా ఢిల్లీ డెర్డెవిల్స్ ముందే రేసు నుంచి నిష్క్రమించింది. దీంతో ఈ మ్యాచ్ ఫలితం ఏ విధంగా ప్లే ఆఫ్స్ రేసులో ప్రభావం చూపించబోదు. ఇప్పటికే రేసు నుంచి వైదొలిగిన డెర్డెవిల్స్ ఈ విజయంతో ఊరట పొందింది.
ఢిల్లీ తడబాటు : తొలుత బ్యాటింగ్ చేసిన డెర్డెవిల్స్కు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. యువ బ్యాట్స్మన్ పృథ్వీ షా (17, 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రెండు బౌండరీలు కొట్టినా.. వేగంగా ఆడలేకపోయాడు. కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ (19, 22 బంతుల్లో 3 ఫోర్లు) మరీ నెమ్మదిగా ఆడాడు. దీంతో ఆరంభంలో ఢిల్లీ స్కోరు మందకోడిగా సాగింది. మూడో స్థానంలో వచ్చిన రిషబ్ పంత్ (38, 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) కొత్త ఆశలు రేకెత్తించాడు. పంత్ దూకుడుగా ఆడటంతో ఢిల్లీ పుంజుకున్నట్టే కనిపించింది. కానీ అయ్యర్, పంత్లను వెనక్కి పంపిన లుంగి ఎంగిడి ఢిల్లీని గట్టి దెబ్బకొట్టాడు. స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ (5) ఈ మ్యాచ్లోనూ వైఫల్యాన్ని కొనసాగించాడు. 97/5తో కష్టాల్లో ఉన్న దశలో లోయర్ ఆర్డర్ ఢిల్లీని ఆదుకున్నది. విజరు శంకర్ (36), హర్షల్ పటేల్ (36)లు మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ రాణించటంతో ఢిల్లీ మెరుగైన స్కోరు నమోదు చేసింది. హర్షల్ నాలుగు సిక్సర్లతో చెలరేగగా.. విజరు శంకర్ రెండేసి ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. ఆరో వికెట్కు అజేయంగా ఫిఫ్టీ ప్లస్ పరుగులు జోడించిన శంకర్, పటేల్లు చెన్నై లక్ష్యాన్ని కాస్త పెంచగలిగారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో చాహర్, జడేజా, ఠాకూర్లు తలా ఓ వికెట్ పడగొట్టగా.. ఎంగిడి రెండు వికెట్లతో మెరిశాడు.