Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత అథ్లెట్లు తొలిసారి ఓ మెగా ఈవెంట్ కోసం విదేశాల్లో సాధన చేయనున్నారు. ఈ మేరకు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకున్నది. ఆగష్టులో ఇండోనేషియా వేదికగా ఆసియా గేమ్స్ జరుగనున్నాయి. భారత్ నుంచి 17 మంది అథ్లెట్ల బృందం ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోతున్నది. దీంతో మెరుగైన సాధన కోసం అథ్లెట్లను భూటాన్ పంపిస్తున్నారు. మే 21-జూన్ 20 వరకూ అథ్లెట్లు భూటాన్లో సాధన చేయనున్నారు. భూటాన్లోని థింపూ ట్రాక్ అండ్ ఫీల్డ్ సెంటర్ ఇందుకు వేదిక కానున్నది. ఇక్కడున్న అధునాతన సింథటిక్ ట్రాక్పై భారత అథ్లెట్లు పరుగు పెట్టనున్నారు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 2500 మీటర్ల ఎత్తులో ఉండటం పోటీల్లో అథ్లెట్లకు కలిసొచ్చే అంశం. భారత అథ్లెట్లు గతంలో ఊటీ, ధర్మశాలలో సాధన చేసేవారు. భూటాన్లో శిక్షణ పొందనున్న అథ్లెట్లలో సుధాసింగ్, చిత్ర, సూర్య, గోవిందన్, తోనకల్, సరోజ్, జాన్సన్లు సైతం ఉన్నారు.