Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4-1తో నెగ్గిన అమ్మాయిల జట్టు
- ఉబర్ కప్ ఫైనల్స్ బ్యాడ్మింటన్
బ్యాంకాక్ : తొలి మ్యాచ్లో ఓడినా, తర్వాత పోరులో నెగ్గిన అమ్మాయిలు ఉబర్ కప్ ఫైనల్లో నాకౌట్ ఆశలు సజీవంగా నిలుపుకున్నారు. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ముందుండి మహిళల జట్టును గెలుపు దిశగా నడిపించగా ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా 4-1తో ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్లో కెనడా చేతిలో సైనాసేన 1-4తో దారుణ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్ తొలి మ్యాచ్లో సైనా నెహ్వాల్ 21-14, 21-19తో గెలుపొంది భారత్కు 1-0 ఆధిక్యం అందించింది. 35 నిమిషాల గేమ్ను వరుస సెట్లలో సైనా సునాయాసంగా సొంతం చేసుకున్నది. కానీ తర్వాతి మహిళల డబుల్స్లో భారత్కు చుక్కెదురైంది. జక్కంపూడి మేఘన, పూర్విశ జోడీ 13-21, 16-21తో వరుస గేముల్లో ఓటమిపాలయ్యారు.
జక్క వైష్ణవి రెడ్డి మహిళల సింగిల్స్ రెండో మ్యాచ్లో 21-17, 21-13తో జెన్నీఫర్ టామ్పై విజయం సాధించింది. మరో డబుల్స్లో సన్యోగిత, ప్రజక్త జోడీ 21-19, 21- 11తో పైచేయి సాధించింది. మూడో సింగిల్స్లో ప్రభుదేశారు అనుర 21-6, 21-7తో జెసిలీ ఫంగ్ను ఓడించి భారత్కు 4-1 విజయాన్ని అందిం చింది. నేడు జపాన్తో జరిగే మ్యాచ్లో మనోళ్లు నెగ్గితే నాకౌట్కు చేరుకునే అవకాశం ఉంటుంది. గత రెండు సీజన్లలో భారత మహిళల జట్టు ఉబర్ కప్లో కాంస్యం సాధించింది. ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు ఉబర్ కప్ ఫైనల్స్లో ఆడటం లేదు.