Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) ఢిల్లీ డెర్డెవిల్స్ను హెచ్చరించినట్టు సమాచారం. గత శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్కు ముందు జరిగిన సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ డిన్నర్కు డెర్డెవిల్స్ చీర్గర్ల్స్ను సైతం ఆహ్వానించింది. టోర్నీ జరిగే సమయంలో ఆటగాళ్లతో మ్యాచ్ అధికారులు మినహా ఎవ్వరితోనూ కలిసే అవకాశం ఉండదు. ఈ మేరకు ప్రాంఛైజీలకు స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ' చీర్గర్ల్స్ను ఆహ్వానించారు. వీళ్లతో క్రికెటర్లు కలిసి చిందులేశారని మా అభిప్రాయం కాదు. కానీ మరోమారు ఇలా జరుగకుండా చూసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం పార్టీలకు చీర్గర్ల్స్ను ఆహ్వానించటం నిషిద్ధం' అని ఓ ఏసీయూ అధికారి తెలిపారు. కానీ హెచ్చరిక వార్తలను డెర్డెవిల్స్ ఖండించింది. ఈ విషయాన్ని ఏసియూ టోర్నీ నివేదికలో ప్రస్తావించనున్నది.