Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్కంఠ టీ20లో కౌర్సేన గెలుపు
- రాణించిన మిథాలీ రాజ్
- మహిళల ఐపీఎల్ ఎగ్జిబిషన్ మ్యాచ్
నవతెలంగాణ-ముంబయి
అంతర్జాతీయ అత్యుత్తమ క్రికెటర్లు బరిలో నిలిచిన వేళ. మహిళల క్రికెట్ను మలుపు తప్పిగల సందర్భం. కానీ, ఫలితం ఊహించ లేదు. ఆఖరి బంతి వరకూ సాగిన థ్రిల్లర్ క్రికెట్ పోటీతత్వాన్ని, స్ఫూర్తిని రగిల్చినా.. మహిళల ఐపీఎల్ అభిమానులను ఆకర్షించటంలో విఫలమైంది!. అత్యుత్తమ క్రికెటర్లు మైదానంలో నిలిచినా.. ఆట అంచనాలను అందుకోలేదు. మహిళల ఐపీఎల్ దిశగా ప్రయోగాత్మకంగా నిర్వహించిన టీ20 చాలెంజ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని సూపర్నోవాస్ మెరుపు విజయం సాధించింది. దిగ్గజాలతో కూడిన కౌర్ శిబిరం.. యువ సేనాని స్మృతీ సారథ్యంలోని ట్రయల్బ్లేజర్స్పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఛేదనలో దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ (22, 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), హర్మన్ప్రీత్ కౌర్ (21, 23 బంతుల్లో 1 ఫోర్), వ్యాట్ (23, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో ఆఖరి బంతికి సూపర్నోవాస్ లక్ష్యాన్ని చేరుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్బ్లేజర్స్ 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు సాధించింది. సుజి బేట్స్ (32, 37 బంతుల్లో 2 ఫోర్లు), రొడ్రిగస్ (25, 23 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. స్టార్ బ్యాట్స్వుమెన్ స్మృతీ మంధాన (14, 9 బంతుల్లో 3 ఫోర్లు) నిరాశపరిచింది. ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన సుజి బేట్స్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నది.
మిథాలీ, కౌర్ మెరిసెన్ : 130 పరుగుల ఛేదనలో స్టార్ బ్యాట్స్వుమెన్ మిథాలీరాజ్ (22) రెచ్చిపోయింది. ఓపెనర్గా వచ్చిన మిథాలీ.. 17 బంతుల్లోనే మూడు ఫోర్లు సహా ఓ భారీ సిక్సర్ కొట్టింది. డానెలి వ్యాట్ (24)తో కలిసి తొలి వికెట్కు 47 పరుగులు జోడించిన మిథాలీ సూపర్నోవాస్ విజయానికి గట్టి పునాది వేసింది. మూడో స్థానంలో వచ్చిన మెగ్ లానింగ్ (16) మూడు ఫోర్లతో మెరిసినా.. వికెట్ నిలుపుకోలేదు. రన్రేట్ నెమ్మదించగా.. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ (21), డివైన్ (19)లు కలిసి మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీ మ్యాచ్ను సూపర్ నోవాస్పై తిప్పేసింది. ఆఖరి ఓవర్లో 3 పరు గులు చేయాల్సి ఉండగా.. ఎలిసీ పెర్రీ (13), వాస్ట్రాకర్ (2)లు ఆఖరి బంతికి సింగిల్ తీసి విజయాన్ని అందించారు. ట్రయల్బ్లేజర్ బౌలర్ సుజి బేట్స్ (2/16), పూనమ్ యాదవ్ (2/21) రాణించారు. వెటరన్ పేసర్ జులన్ గోస్వామి (1/22), ఏక్తా బిస్త్ (1/24) ఆకట్టుకున్నారు.
స్మృతీ విఫలం : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ట్రయల్బ్లేజర్స్కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ హీలే (7) ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే వికెట్ పారేసుకున్నది. మరో ఎండ్లో మూడు బౌండరీలతో జోరు మీదున్న కెప్టెన్ స్మతీ మంధాన (14) తర్వాతి ఓవర్లో కౌర్ కండ్లుచెదిరే క్యాచ్తో నిష్క్రమించింది. దీంతో చారిత్రక మ్యాచ్లో మంధాన ఇన్నింగ్స్కు ముగింపు తప్పలేదు. మిడిల్ ఆర్డర్లో సుజి బేట్స్ (32, 37 బంతుల్లో 2 ఫోర్లు) పరిస్థితికి అనుగుణంగా ఆడింది. నెమ్మదిగా పరుగులు రాబట్టిన బేట్స్.. స్కోరు బోర్డును కదిలించింది. బేట్స్కు దీప్తి శర్మ (21, 22 బంతుల్లో 3 ఫోర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. టీ20 స్థాయి మెరుపులు కనిపించకపోవటంతో భారీ స్కోరుపై ఆశలు లేకుండా పోయాయి. లోయర్ ఆర్డర్లో రొడ్రిగస్ (25) ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. సూపర్నోవాస్ బౌలర్లలో ఎలిసీ పెర్రీ (2/20), మేఘన స్కట్ (2/18) రాణించారు.
ట్రయల్బ్లేజర్స్ ఇన్నింగ్స్ : అలిసా హిలే (సి) వ్యాట్ (బి) స్కట్ 7, స్మృతీ మంధాన (సి) కౌర్ (బి) పెర్రీ 14, సుజి బేట్స్ (బి) పెర్రీ 32, మూనీ (సి) వేద (బి) స్కట్ 4, దీప్తి శర్మ (సి) కౌర్ (బి) గైక్వాడ్ 21, రొడ్రిగస్ (సి) పెర్రీ (బి) అనుజ 25, శిఖా పాండే నాటౌట్ 14, హజెల్ నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 09, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 129.
వికెట్ల పతనం : 1-17, 2-21, 3-26, 4-58, 5-103, 6-123.
బౌలింగ్ : అనుజ పాటిల్ 4-0- 34-1, మేఘన స్కట్ 4-0-1 8-2, ఎలిసీ పెర్రీ 3-0-20-2, గైక్వాడ్ 4-0- 21-1, వాస్ట్రాకర్ 2-0-9-0, డివైన్ 2-0-14-0, హర్మన్ప్రీత్ 1-0-6-0.
సూపర్నోవాస్ ఇన్నింగ్స్ : మిథాలీరాజ్ (సి) తహుహు (బి) ఏక్తా 22, వ్యాట్ (సి) మూనీ (బి) పూనమ్ 24, మెగ్ లానింగ్ (సి) రొడ్రిగస్ (బి) పూనమ్ 16, హర్మన్ప్రీత్ కౌర్ (సి) తహుహు (బి) బేట్స్ 21, డివైన్ (బి) బేట్స్ 19, వేద కృష్ణమూర్తి (బి) జులన్ 2, ఎలిసీ పెర్రీ నాటౌట్ 13, మెష్రం రనౌట్ (మంధాన) 4, వాస్ట్రాకర్ నాటౌట్ 2, ఎక్స్ట్రాలు : 07, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 130.
వికెట్ల పతనం : 1-47, 2-57, 3-71, 4-106, 5-111, 6-113, 7-126.
బౌలింగ్ : జులన్ గోస్వామి 4-0-22-1, తహుహు 2-0-14-0, శిఖా పాండే 1-0-11-0, ఏక్తా బిస్త్ 4-0-24-1, పూనమ్ యాదవ్ 4-0- 21-2, హెజెల్ 1-0-10-0, దీప్తి శర్మ 1-0-10-0, సుజి బేట్స్ 3-0-16-2.