Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాతనిథ్యంపై విస్తృతంగా కథనాలు
ముంబయి : ప్రపంచ క్రికెట్లో ఇప్పుడు సరికొత్త తరహా పోటీలు ఉద్బవిస్తున్నాయి. యు.ఏ.ఈలో పది ఓవర్ల మ్యాచ్ ఆడుతుంటే.. వచ్చే ఏడాది నుంచి ఇంగ్లాండ్ 100 బంతుల మ్యాచ్లకు శ్రీకారం చుట్టనున్నది. ఇప్పుడున్న టీ20 లీగ్ స్థానంలోనే ఇంగ్లాండ్ సరికొత్తగా 100 బంతుల టోర్నీకి ఏర్పాట్లు చేస్తోంది. ఐపీఎల్ మార్కెటింగ్ కోసం భారత క్రికెటర్లను విదేశీ లీగ్ల్లో అనుమతించని బీసీసీఐ.. వంద బంతుల టోర్నీకి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని బోర్డు వర్గాల నుంచి వార్తలొస్తున్నాయి!. 15 సంప్రదాయ ఆరు బంతుల ఓవర్లకు తోడు ఓ 10 బంతుల ఓవరుండే ' ది హండ్రెడ్' టోర్నీకి యువత భారీ సంఖ్యలో ఆకర్షితులవుతారని ఇంగ్లాండ్ బోర్డు భావిస్తోంది. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ టోర్నీలో భారత క్రికెట్ స్టార్స్ ఎం.ఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఆడితే లీగ్కు విపరీతమైన ఆదరణ లభిస్తోందని ఇంగ్లీష్ బోర్డు అంచనా. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఉన్నతాది óకారులను ఇంగ్లాండ్ బోర్డు కలిసినట్టు వార్తలొచ్చాయి. రెండున్నర గంటల్లోనే ముగిసే ఈ లీగ్కు సాయంకాలం వేళల్లో ఆదరణ బాగుంటుందని అంచనా వేస్తున్నారు.