Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 125 పరుగులతో భారత్-ఏ విజయం
లీడ్స్ : కుర్రాళ్లు కుమ్మేశారు. ఇంగ్లాండ్ పర్యటనను ఘనంగా ఆరంభించారు. తొలి మ్యాచ్లోనే పరుగుల మోత, వికెట్ల వేట సాగించిన భారత్-ఏ 125 పరుగులతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 328 పరుగులు చేసింది. యువ ఓపెనర్ పృథ్వీ షా (70, 61 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు), కెప్టెన్ శ్రేయాష్ అయ్యర్ (54, 45 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (50, 46 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలతో కదం తొక్కారు. మయాంక్ అగర్వాల్ (4), విజరు శంకర్ (11) విఫలమయ్యారు. కృనాల్ పాండ్య (34) రెండేసి సిక్సర్లు, ఫోర్లతో అలరించాడు. ఛేదనలో ఇంగ్లాండ్కు మనోళ్లు చుక్కలు చూపించారు. దీపక్ చాహర్ (3/48), అక్షర్ పటేల్ (2/21) మెరిసిన వేళ ఇంగ్లాండ్ 203 పరుగులకే కుప్పకూలింది. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టిన బౌలర్లు ఆరంభ మ్యాచ్లోనే అదిరే విజయాన్ని కట్టబెట్టారు.