Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరిన భారత్
న్యూఢిల్లీ: 81 రోజుల సుదీర్ఘ బ్రిటన్ పర్యటనకు భారత జట్టు పయనమైంది. తొలుత ఐర్లాండ్తో రెండు టీ20 ఆడనున్న కోహ్లిసేన.. తర్వాత ఇంగ్లాండ్తో వన్డే, టీ20 సహా ఐదు మ్యాచుల టెస్టు సిరీస్లో పోటీపడనున్నది. ఇంగ్లాండ్కు బయల్దేరే ముందు కోచ్ రవిశాస్త్రితో కలిసి కెప్టెన్ కోహ్లి మీడియా ముందుకొచ్చాడు. కఠినమైన సిరీస్కు భారత్ సిద్ధంగా ఉన్నదని కోహ్లి పేర్కొన్నాడు. కీలక టెస్టు సిరీస్కు ముందు సుమారు నెల రోజులు అక్కడ పరిస్థితుల్లో ఉండటం కారణంగా ఇంగ్లాండ్ సిరీస్ విదేశీ భావనకు దూరంగా సాగనుందని కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో మెడ గాయానికి గురైన కోహ్లి.. వంద శాతం ఫిట్నెస్తో ఉన్నానని చెప్పాడు. యో యో టెస్టు భారత జట్టు ఎంపికకు బెంచ్మార్క్ అని రవిశాస్త్రి అన్నాడు. 2014లో జట్టుగా ఆడినా సమష్టి ప్రదర్శనలో విఫలమయ్యాని, ఐనా ఆ ఓటమి ప్రభావం ప్రస్తుత సిరీస్పై ఏమాత్రం ఉండబోదని కోహ్లి అన్నాడు.