Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4-0తో పాకిస్థాన్పై ఘన విజయం
- హాకీ చాంపియన్స్ ట్రోఫీ
బ్రెడా(నెదర్లాండ్): హాకీ ఇండియా అదరగొట్టింది. పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చిత్తుగా ఓడించింది. హోరాహోరీగా సాగిన టోర్నీ ఆరంభ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఆరంభ మ్యాచ్లో నాల్గు గోల్స్ కొట్టిన టీమ్ ఇండియా 4-0తో పాకిస్థాన్పై తిరుగులేని విజయం సాధించింది. చాంపియన్స్ ట్రోఫీలో ఘనమైన బోణీ కొట్టింది. భావోద్వేగాలు కీలక పాత్ర పోషించిన పోరుగు దేశాల సమరంలో తొలి క్వార్టర్ గోల్ లేకుండానే ముగిసింది. కానీ రెండో క్వార్టర్లో భారత్ గోల్ ఖాతా తెరిచింది. రమన్దీప్ సింగ్ 25వ నిమిషంలో ఫీల్డ్ గోల్ సాధించి భారత్ను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. మూడో క్వార్టర్స్లో సైతం గోల్సేమీ నమోదు కాలేదు. స్కోరు సమం చేసేందుకు ఆఖరి క్వార్టర్లో పాకిస్థాన్ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ భారత్ ఎప్పటికప్పుడు పాక్ ప్రయత్నాలను తిప్పికొడుతూనే.. గోల్స్ వర్షం కురిపించింది. మరో ఆరు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. మనోళ్లు ఏకంగా మూడు గోల్స్ కొట్టారు. 54వ నిమిషంలో దిల్ప్రీత్ సింగ్, 57వ నిమిషంలో మన్దీప్ సింగ్, 60వ నిమిషంలో లలిత్ ఉపాధ్యారులు గోల్స్ కొట్టేశారు. దీంతో టీమ్ ఇండియా 4-0తో ఎదురులేని విజయం నమోదు చేసింది. నేడు మరో మ్యాచ్లో అర్జెంటీనాతో టీమ్ ఇండియా తలపడనున్నది.