Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే కోచ్గా తప్పుకున్న తుషార్
బెంగళూర్ : సరిగ్గా ఏడాది క్రితం భారత మహిళల క్రికెట్ ఎన్నడూ లేనంత పాపులారిటి, ఆదరణ పొందింది. ప్రపంచకప్ ఫైనల్లోకి చేరిన మహిళల జట్టు స్వర్ణ యుగానికి ఆరంభం అనిపించింది. ఇటీవల ఆసియా కప్ ఫైనల్లోకి చేరినా బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో జట్టులో విభేదాలు పాలకుల కమిటీ (సీవోఏ)తో భేటీ అయిన మిథాలీరాజ్, హర్మన్ప్రీత్ కౌర్లు కోచ్పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనిపై వివరణ అడినందునే కోచ్ తుషార్ రాజీనామా చేశాడు. ప్రస్తుతం బెంగళూర్లో ఉన్న తుషార్..' సీనియర్లతో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని, మన లక్ష్యం పెద్దది అయినప్పుడు, మనం సౌకర్యవంతమైన జోన్ నుంచి బయట పడి కష్టపడాలి' అని అన్నాడు.