Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థాయ్లాండ్ ఓపెన్
బ్యాంకాక్ : థాయ్లాండ్ ఓపెన్లో మనోళ్లు శుభారంభం చేశారు. తొలి రౌండ్ మ్యాచుల్లో భారత షట్లర్లు అలవోక విజయం సొంతం చేసుకున్నారు. మహిళల సింగిల్స్లో రెండో సీడ్ పి.వి సింధు అర గంటలోనే రెండో రౌండ్కు దూసుకెళ్లింది. బల్గేరియా షట్లర్ లిందాపై 21-8, 21-15తో ఏకపక్ష విజయం సాధించిన సింధు తర్వాత రౌండ్కు చేరుకున్నది. పురుషుల సింగిల్స్లో సీనియర్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లో గెలుపొందాడు. 21-15, 21-17తో ఆంటోని (కెనడా)పై విజయం సాధించాడు. సంచలన స్టార్ హెచ్.ఎస్ ప్రణరు 21-16, 21-19తో పాబ్లో అబియన్ (స్పెయిన్)ను చిత్తుగా ఓడించి రెండో రౌండ్కు చేరుకున్నాడు. మరో ఆటగాడు సమీర్ వర్మ 18-21, 16-21తో లోకల్ షట్లర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. వైష్ణవి రెడ్డి జక్క 13-21, 17-21తో జపాన్ అమ్మాయి సయాక సటో చేతిలో పోరాడి ఓడింది.