Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్డే సిరీస్పై కోహ్లిసేన కన్ను
- ఒత్తిడిలో ఆతిథ్య ఇంగ్లాండ్
- నేడు రెండో వన్డే పోరు
- మ.3.30 నుంచి సోనీసిక్స్లో..
వన్డేల్లో వరుసగా భారీ స్కోర్ల విధ్వంసాలు. అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ప్రదర్శనతో శత్రు దుర్బేద్య శిబిరంగా కితాబు!. కానీ ఇంగ్లాండ్కు టీమ్ ఇండియా ఝలక్ ఇచ్చింది. బంతిని తిప్పేసి ఇంగ్లాండ్ బలహీనతను బయటపెట్టేసింది. దీంతో ఇంగ్లాండ్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిలో పడింది. వరుసగా రెండో సిరీస్పై కన్నేసినన కోహ్లిసేన లార్డ్స్లోనే పని పూర్తి చేయాలనుకుంటోంది. స్పిన్కు అనుకూలించని లార్డ్స్లో ఇంగ్లాండ్ అందుకు తలొగ్గుతుందా? చూద్దాం.
లార్డ్స్ (ఇంగ్లాండ్)
వన్డేల్లో వరల్డ్ నం.1 ర్యాంక్. జట్టులో భీకర ఫామ్లో ఉన్న ఆటగాళ్లు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదురు దాడి చేయగల సత్తా ఇంగ్లాండ్ సొంతం. దీంతో భారత్తో వన్డే పోటీ నువ్వా నేనా అన్నట్టు సాగటం ఖాయం అనిపించింది. కానీ వాస్తవం మరో విధంగా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ స్పిన్ బలహీతనను గొప్పగా సొమ్ము చేసుకుంటున్న టీమ్ ఇండియా పర్యటనలో రెండో సిరీస్పై కన్నేసింది. లార్డ్స్ వన్డేలోనే నెగ్గి సిరీస్ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. ప్రపంచ కప్ ముంగిట సొంతగడ్డపై వన్డే సిరీస్ కోల్పోతే.. అది కచ్చితంగా ఇంగ్లాండ్ను మానసికంగా దెబ్బకొడుతుంది. అందుకు మోర్గాన్ బృందం సుముఖంగా లేదు!.
కోహ్లి మేనియా : 2014 ఇంగ్లాండ్ పర్యటనను పీడకలగా ముగించిన విరాట్ కోహ్లి.. తాజా పర్యటనలో మ్యాచ్ మ్యాచ్కూ మెరుగవుతున్నాడు. టీ20 సిరీస్లో మెరువని కోహ్లి.. తొలి వన్డేల్లో 75 పరుగుల స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్ నమోదు చేశాడు. కొన్ని చూడచక్కని సంప్రదాయ షాట్లతో అలరించిన విరాట్.. నేడు లార్డ్స్లో భారీ ఇన్నింగ్స్పై కన్నేశాడని చెప్పవచ్చు. ఇంగ్లీష్ బౌలర్లను అతి సునాయాసంగా ఎదుర్కొన్న కోహ్లి సిరీస్ సాగుతున్న కొద్దీ మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం లేకపోలేదు. రోహిత్ శర్మ శతకంతో అదరగొట్టగా.. శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ను ధాటిగా మొదలెట్టి తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. సురేశ్ రైనా మిడిల్ ఆర్డర్లో అవకాశం కోసం (తుది జట్టులో ఉన్నా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు) ఎదురుచూస్తు న్నాడు. బేంతి తో కుల్దీప్, చాహల్ జోడీ మరోసారి కీలకం కానున్నారు. ఉమేశ్ యాదవ్తో కలిసి సిద్దార్థ్ కౌల్ ప్రభావం చూపించటంపై దృష్టి పెడుతున్నాడు.
ఇంగ్లాండ్ పుంజుకునేనా : టీ20 సిరీస్లోనూ తొలి మ్యాచ్లో ఇలాగే ఓడిన ఇంగ్లాండ్.. తర్వాతి మ్యాచ్లో పుంజుకున్నది. దీంతో పేస్ స్వర్గ ధామం లార్డ్స్లో ఇంగ్లాండ్ సిరీస్ సమం చేస్తుందని విశ్లేషకుల అంచనా. కానీ తొలి వన్డేలో బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ చూస్తే.. కుల్దీప్ ఎంత ప్రమాదకరంగా తయారయ్యోడో తెలుస్తోంది. వందకు పైచిలుకు బంతులాడిన స్టోక్.. 50 పరుగులే చేశాడు. భారీ షాట్లు బాదగల స్టోక్స్కు వన్డేల్లో ఇది రెండో అత్యంత నెమ్మదైన అర్ధ సెంచరీ.స్టార్ బ్యాట్స్మన్ జో రూట్ లార్డ్స్లోనైనా కాసిన్ని పరుగులు చేయాలని ఇంగ్లాండ్ కోరుకుంటోంది. జోశ్ బట్లర్ మరోమారు ఇంగ్లాండ్ను ఆదుకునే ఇన్నింగ్స్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తున్నాడు. ట్రెంట్బ్రిడ్జ్లో భారత బ్యాట్స్మెన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేని ఇంగ్లాండ్ బౌలర్లపై ఆ జట్టు పునరాలోచన చేసుకునే అవసరం ఏర్పడింది. ఇంగ్లీష్ బౌలర్లు సరికొత్త వ్యూహంతో రావాల్సిన అవసరాన్ని మనోళ్లు కల్పించారు.
బంతి తిరుగునా? : లార్డ్స్ పిచ్ సహజసిద్ధంగా బంతికి, బ్యాట్కు సమాన పోటీకి అవకాశం కల్పిస్తుందని క్రికెట్ పండితుల భావన. ప్రస్తుతం ఇంగ్లాండ్లో వేసవి కావటం, బాగా ఎండ కాస్తున్న సమయంలో పిచ్ టర్న్కు అనుకూలిస్తుందని అంచనా. కానీ లార్డ్స్లో సంప్రదాయబద్ద స్పిన్కు మెరుగైన రికార్డు లేదు. కానీ కుల్దీప్ నమ్మశక్యం కాని రీతిలో బంతిని తిప్పేస్తున్నాడు. లార్డ్స్లో కుల్దీప్ మాయ పని చేయబోదని ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ నమ్మకంగా చెబుతున్నాడు. దీంతో మరోమారు ఫలితం బంతి తిరగటంపైనే ఆధారపడి ఉంటుంది. స్పిన్ను అనుకూలిస్తే మనకు ఇక్కడే సిరీస్ చిక్కినట్టు లెక్క!.
టెస్టుల్లోనూ ఈ ఇద్దరే!
వన్డే, టీ20ల్లో ఇరగదీస్తోన్న మణికట్టు మాయగాళ్లను టెస్టుల్లోనూ ఆడించాలనే ఉబలాటం ఎక్కువైందని భారత కెప్టెన్ కోహ్లి అంటున్నాడు. ఇంగ్లాండ్కు స్పిన్ ఎదుర్కొవటం మరీ పెద్ద సమస్య కాదు కానీ మణికట్టు స్పిన్నర్లతోనే మరింత సమస్య వస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన కోహ్లి.. రానున్న ఐదు టెస్టుల సిరీస్లోనూ చాహల్, కుల్దీప్లను ఆడించే అవకాశం లేకపోలేదని సంకేతాలిచ్చాడు. అదే జరిగితే సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు భారత జట్టు ద్వారాలు పూర్తిగా మూసినట్టే అని భావించిక తప్పదు!. కుల్దీప్ ఆస్ట్రేలి యాపై టెస్టు అరంగేట్రం చేయగా.. చాహల్ టెస్టు పిలుపు కోసం ఎదురుచూస్తున్నాడు. తాజా బ్రిటన్ పర్యటనలో కుల్దీప్ ఇప్పటికే 18 వికెట్లు (ఐర్లాండ్తో సిరీస్ సహా) పడగొట్టాడు.