Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాంకాక్ : భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధుకు మరోమారు నిరాశ తప్పలేదు. ఈ ఏడాది మూడోసారి ఫైనల్లోకి ప్రవేశించినా తెలుగు తేజానికి టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది. వరల్డ్ చాంపియన్ నొజొమి ఒకుహర (జపాన్)తో జరిగిన టైటిల్ పోరులో వరల్డ్ నం.3 సింధు వరుస గేముల్లో ఓటమిపాలైంది. 50 నిమిషాల్లోనే జపాన్ అమ్మాయి థారులాండ్ ఓపెన్ కైవసం చేసుకున్నది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో సింధు 15-21, 18-21తో ఓటమిపాలైంది. తొలి గేమ్లో 6-2తో దూకుడు ఆడిన ఒకుహర విరామ సమయానికి 11-8తో ఆధిక్యం నిలుపుకున్నది. 17-13తో తిరుగులేని స్థితి నుంచి తొలి గేమ్ గెల్చుకున్నది. ఇక రెండో గేమ్లో సింధు 6-2తో ముందంజ వేసినా,సింధును అనవసర తప్పులు చేసేలా ప్రేరేపించిన ఒకుహర తెలివగా పాయింట్లు సాధించింది. ఓ దశలో 18-18తో హోరాహోరీ ఖాయమనుకున్నా.. 21-18తో అలవోక విజయం సాధించింది.