Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం తీర్పుపై రిటైర్డ్ జస్టిస్ లోధా
ముంబయి : బీసీసీఐ నూతన రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ ఆగస్టు 9న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై లోధా కమిటీ చైర్మన్ జస్టిస్ ఆర్.ఎం లోధా నిరుత్సాహం చెందారు. ఈ మేరకు మాజీ ప్రధాన న్యాయమూర్తి శుక్రవారం స్పందించారు. ' కీలక సిఫారసుల లక్ష్యాన్ని నీరుగార్చారు. భారత క్రికెట్ బోర్డులో పాలకుల గుత్తాధిపత్యాన్ని తెరదించాలని అనుకున్నాం. స్వతంత్య్ర క్రికెట్ బోర్డులో ప్రభుత్వ జోక్యాన్ని తక్కువ చేయాలని భావించాం. కానీ తాజాగా ఆమోదించిన రాజ్యాంగంలో సిఫారసుల్లోని కీలకమైన నిబంధనల స్ఫూర్తి దెబ్బతిన్నది. విరామ సమయాన్ని రెండు పర్యాయాలకు పెంచటంతో.. పాలకులు వరుసగా రెండు సార్లు పదవిలో కొనసాగుతారు. రైల్వేస్, సర్వీసెస్, యూనివర్శిటీలకు ఓటు హక్కు ఇవ్వటంతో.. ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు ప్రభుత్వం జోక్యంతో బోర్డులో కీలకంగా మారుతుంది. విఫలమయ్యాననే భావన లేదు కానీ నిరుత్సాహం చెందాను. ఓ న్యాయమూర్తిగా తొలుత ఇచ్చిన తీర్పును మార్పు చేసేందుకు ఇప్పుడు సుప్రీంకోర్టు తనకు తాను మార్పు చేసేందుకు ఏ న్యాయ సూత్రాలను అనుసరించిందనే విషయమై ఆలోచన చేస్తున్నానని జస్టిస్ ఆర్.ఎం లోధా అన్నారు.