Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 107కే కుప్పకూలిన కోహ్లిసేన
- అండర్సన్ ఐదు వికెట్ల ప్రదర్శన
- లార్డ్స్ టెస్టు రెండో రోజు
తొలి రోజు మాదిరి రెండో రోజు సైతం వరుణుడు పూర్తిగా ఆటను తుడిచి పెట్టేస్తే బాగుండు!. లార్డ్స్ టెస్టులో పాతిక ఓవర్లు ముగిసే లోపే సగటు భారత అభిమాని ఆవేదన ఇది!. వర్షం అంతరాయం కల్గించిన రెండో రోజు ఆటలో భారత్ స్వల్ప స్కోరుకు పరిమితమైంది. కెప్టెన్ కోహ్లి (23), రహానె (18), విజరు (0), రాహుల్ (8), పుజార (1), హార్దిక్ (11), కార్తీక్ (1) పెవిలియన్కు క్యూ కట్టిన వేళ లార్డ్స్లో కోహ్లిసేన 107 పరుగులకే కుప్పకూలింది.
లండన్
వికెట్లు..వర్షం..వికెట్లు..వర్షం..వికెట్లు.. ఇదీ లార్డ్స్లో రెండో రోజు ఆట సాగిన తీరు. తొలుత ఐదు ఓవర్లలోనే భారత్ ఓపెనర్లను కోల్పోయిన భారత్ వర్షం అంతరాయంతో కాస్త ఉపశమనం పొందింది!. కానీ మళ్లీ 12 బంతుల పాటు కొనసాగిన ఆటలో పుజారను కోల్పోయిన భారత్ వర్షం అంతరాయంతో మరోమారు వికెట్ల పతనం నుంచి తప్పించుకున్నది. కానీ ఈసారి మరోమారు వరుణుడు రాలేదు.. దీంతో భారత వికెట్ల పతనం పరిపూర్ణమైంది!. 35.2 ఓవర్లలో 107 పరుగులు చేసిన భారత్ పది వికెట్లు కోల్పోయింది. టెయిలెండర్ అశ్విన్ (29, 38 బంతుల్లో 4 ఫోర్లు) భారత ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు సాధించాడు. ఇంగ్లాండ్ స్టార్ సీమర్ అండర్సన్ (5/20) ఐదు వికెట్లతో నిప్పులు చెరిగాడు. లార్డ్స్లో అండర్సన్ 100 వికెట్ల ఘనతకు వికెట్ దూరంలో నిలిచాడు.
టప టపా వికెట్లు : ఎంతో ఆసక్తి రేపిన లార్డ్స్ టెస్టులో భారత్ పేలవంగా ఆడుతోంది. టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. సీమ్కు అనుకూలించిన పిచ్పై ఇంగ్లాండ్ పేసర్లు నిప్పులు చెరిగారు. తొలి ఓవర్ ఐదో బంతికే ఓపెనర్ మురళీ విజరు (0)ను చూడచక్కని అవుట్ స్వింగర్తో క్లీన్ బౌల్డ్ చేసిన అండర్సన్.. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ (8)ను స్లిప్స్లో పట్టేసుకున్నాడు. శిఖర్ ధావన్ స్థానంలో జట్టులోకి వచ్చిన చతేశ్వర్ పుజార (1) వికెట్ల మధ్య మరోమారు తడబడ్డాడు. కోహ్లి, పుజార ఒకే ఎండ్కు చేరుకున్న వేళ.. పోప్ వికెట్లను గిరాటేసి రనౌట్ పూర్తి చేశాడు. ఈ క్రమంలో రహానెతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దేలా కనిపించిన కోహ్లి (23) ఆ పని ఎంతో సేపు కొనసాగించలేదు. అప్పటికే రెండు సార్లు స్లిప్స్లో పేలవ క్యాచులతో బతికిపోయిన కోహ్లి.. స్లిప్స్లో బట్లర్ చేతికి చిక్కి వికెట్ కోల్పోయాడు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య (11), దినేశ్ కార్తీక్ (1) క్రీజులో కుదురుకునే ప్రయత్నం ఏమాత్రం చేయలేకపో యారు. దీంతో భారత్ 62 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో అశ్విన్ (29) కాసేపు పోరాటం చేశాడు. రహానె (18) ఆరంభంలో మెరుగ్గా కనిపించినా, ఎప్పట్లాగే పేలవంగా వికెట్ కోల్పో యాడు. ఆఖరి మూడు వికెట్లను ఇంగ్లాండ్ వేగంగానే కూల్చేసింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ : మురళీ విజరు (బి) అండర్సన్ 0, కెఎల్ రాహుల్ (సి) బెయిర్స్టో (బి) అండర్సన్ 8, చతేశ్వర్ పుజార రనౌట్ (పోప్) 1, విరాట్ కోహ్లి (సి) బట్లర్ (బి) క్రిస్ వోక్స్ 23, అజింక్య రహానె (సి) కుక్ (బి) అండర్సన్ 18, హార్దిక్ పాండ్య (సి) బట్లర్ (బి) క్రిస్ వోక్స్ 11, దినేశ్ కార్తీక్ (బి) కర్రన్ 1, అశ్విన్ (ఎల్బీ) బ్రాడ్ 29, కుల్దీప్ (ఎల్బీ) అండర్సన్ 0, షమి నాటౌట్ 10, ఇషాంత్ (ఎల్బీ) అండర్సన్ 0, ఎక్స్ట్రాలు : 06, మొత్తం : (35.2 ఓవర్లలో ఆలౌట్) 107.
వికెట్ల పతనం : 1-0, 2-10, 3-15, 4-49, 5-61, 6-6, 7- 84, 8-96, 9-96, 10-107.
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ 13.2-5-20-5, స్టువర్ట్ బ్రాడ్ 10-2-37-1, క్రిస్ వోక్స్ 6-2-19-2, శామ్ కర్రన్ 6-0-26-1