Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కబడ్డీలో పసిడికి గట్టి పోటీ
- ఆర్చరీలో కాంపౌండ్ ఈవెంట్లు కట్
కాంస్యం లేదు, రజతం లేదు, కానీ ఏకంగా తొమ్మిది స్వర్ణాలు. 1990 ఆసియా గేమ్స్లో కబడ్డీని పతక ఈవెంట్ను ప్రవేశపెట్టిన నాటి నుంచి కూతలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. పురుషులు, మహిళల విభాగాల్లో ఇప్పటివరకూ భారత జట్లు ఓటమెరుగవు. జకర్తాలోనూ పసిడి రేసులో ముందున్నా.. ఈసారి ప్రత్యర్థులు మరింత గట్టి పోటీనిచ్చే అవకాశం లేకపోలేదు.
నవతెలంగాణ క్రీడా విభాగం
హాకీ తర్వాత భారత్ అంతగా ఆధిపత్యం చెలాయిస్తోన్న ఆట కబడ్డీ. అది ఆసియా గేమ్స్ కానీ, ప్రపంచకప్ కానీ.. పోటీ ఏదైనా, వేదిక ఎక్కడైనా పసిడి మాత్రం మనదే. 18వ ఆసియా క్రీడలు అందుకు భిన్నంగా సాగబోవని చెప్పవచ్చు. స్వదేశంలో ప్రో కబడ్డీ లీగ్తో ఆటగాళ్ల మరింత రాటుదేలిన వేళ జకర్తాలో టీమ్ ఇండియాకు ముందుగానే రెండు పసడి పతకాలు ఖాయమనే చెప్పవచ్చు!. పురుషుల విభాగంలో ఇరాన్, దక్షిణ కొరియాల నుంచి భారత్కు ముప్పు పొంచి ఉన్నది. ఇటీవల కాలంలో ఈ రెండు దేశాలు భారత్కు దీటుగా సవాల్ విసురుతున్నాయి. పాకిస్థాన్ సైతం భారత్ను ఓడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా.. పొరుగు దేశానికి అందనంత స్థాయికి భారత కబడ్డీ చేరుకున్నది. ప్రొ కబడ్డీ లీగ్లో ఆటగాళ్ల గరిష్ట శరీర బరువుకు నియంత్రణ విధించటంలో కబడ్డీ ప్లేయర్ల ఫిట్నెస్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో రెజ్లర్లతో పోటీపడి కండలు పెంచిన కబడ్డీ క్రీడాకారులు.. ఇప్పుడు స్మార్ట్ గేమ్తో అలరిస్తున్నారు. దీంతో డిఫెన్స్లో, ఎటాకింగ్లో స్మార్ట్ గేమ్ ప్రాముఖ్యత పెరుగుతోంది. భారత్ దారిలోనే దక్షిణ కొరియా, ఇరాన్లు నడుస్తున్నాయి. మహిళల విభాగంలో మన అమ్మాయిలకు తిరుగులేదు. ఐనా, థారులాండ్ మహిళల జట్టు నుంచి మనోళ్లకు గట్టి పోటీ ఎదురు కానున్నది. భారత పసిడి జోరుకు జకర్తాలోనైనా సవాల్ విసరాలని థారులాండ్ సిద్ధమవుతోంది. అజరు ఠాకూర్ సారథ్యంలోని భారత జట్టులో మ్యాచ్ విన్నర్లుగా నిరూపించుకున్న పర్దీప్ నర్వాల్, దీపక్ హుడా, మోహిత్ చిల్లార్ సహా రాహుల్ చౌదరిలు ఉన్నారు. మహిళల జట్టులో కవితా దేవి, ప్రియాంక, పాయల్ చౌదరి, ఉషా రాణి, శాలినిలు కీలకం.
ఆర్చరీలో ముందే ఎదురుదెబ్బ!
జకర్తా ఆసియా గేమ్స్లో భారత ఆర్చరీకి ముందే ఎదురుదెబ్బ. వ్యక్తిగత విభాగాల్లో కాంపౌండ్ పతక ఈవెంట్లను కుదించటంతో మన పతక అవకాశాలు తక్కువయ్యాయి. గత టోర్నీలో మనోళ్లు నాలుగు పతకాలు సాధించగా, అన్నీ కాంపౌండ్ విభాగంలోనే రావటం గమనార్హం. ఆసియా గేమ్స్లో భారత ఆర్చర్లు ఇప్పటివరకూ ఓ స్వర్ణం, రెండు రజతాలు సహా 5 కాంస్య పతకాలు సాధించారు. కొత్తగా జట్టు విభాగాలు ప్రవేశపెట్టారు, దీంట్లోనూ మనకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వరల్డ్ నం.1 మహిళల జట్టులో జ్యోతి సురేఖ, దీపిక కుమారి, త్రిష దెబ్లు పసిడి రేసులో ఉన్నారు. పురుషుల విభాగంలో అటాన్ దాస్, వికాశ్, జగదీశ్ చౌదరిలు మెడల్ సాధించగల సత్తా ఉన్నవారే.