Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ చీఫ్ సెలక్టర్ వెంగ్సర్కార్
లండన్ : ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ ఇండియా తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైంది. తొలి టెస్టులో విరాట్ కోహ్లి వన్మ్యాన్ షో విన్యాసాలతో గెలుపు దాకా వచ్చిన టీమ్ ఇండియా.. లార్డ్స్లో అతడు సైతం విఫలం కావటంతో దారుణంగా ఓడింది. దీంతో తుది జట్టు కూర్పు, టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఫామ్పై విస్తృత చర్చ సాగుతోంది. ముగ్గురు ఓపెనర్లు మురళీ విజరు, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ వైఫల్యం చెందటంతో చివరి రెండు టెస్టులకు యువ ఆటగాళ్లను ఎంపిక చేయాలని మాజీలు కోరుతున్నారు. ఇదే సమయంలో వికెట్ కీపర్గా జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు రిషబ్ పంత్కు ట్రెంట్బ్రిడ్జ్లో ఆడే అవకాశం కల్పించాలని సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ దిలీప్ వెంగ్సర్కార్ అన్నారు. ఇంగ్లాండ్ పర్యటనలో దినేశ్ కార్తీక్ నాలుగు ఇన్నింగ్స్ల్లోనూ విఫలమయ్యాడు. వరుసగా 0, 20, 1, 0 పరుగులు చేశాడు. బర్మింగ్హామ్ రెండో ఇన్నింగ్స్లో 20 పరుగులు చేసిన కార్తీక్.. తొలి రెండు టెస్టుల్లో ఓసారి డకౌట్ అయ్యాడు. మరోసారి ఒక్క పరుగుతో సరిపెట్టుకున్నాడు. దీనికి తోడు వికెట్ల వెనకాల దినేశ్ కార్తీక్ ప్రదర్శన సైతం ఏమంత బాగోలేదు. దీంతో రిషబ్ పంత్కు మూడో టెస్టులో అవకాశం ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ' మూడో టెస్టులో రిషబ్ పంత్కు కచ్చితంగా తుది జట్టులో చోటు ఇవ్వాలి. కెప్టెన్ కోహ్లి మినహా జట్టులో మరో బ్యాట్స్మన్ పరుగులు చేయగలని నిరూపించుకోలేదు. అది ఇంగ్లాండ్ అయినా, ఆస్ట్రేలియా ఐనా పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి' అని వెంగ్సర్కార్ అన్నారు. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సైతం మూడో టెస్టులో రిషబ్ పంత్కు అవకాశం ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే.