Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో వన్డేలో శ్రీలంక విజయం
కతునయకె (శ్రీలంక) : భారత స్టార్ బ్యాట్స్వుమెన్, కెప్టెన్ మిథాలీరాజ్ కెరీర్ అత్యుత్తమ స్కోరుతో కదం తొక్కినా అమ్మాయిలకు విజయం దక్కలేదు. మిథాలీరాజ్ (125 నాటౌట్, 143 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో భారత్ 253 పరుగులు చేసింది. కానీ శ్రీలంక ఆఖరి ఓవర్లో విజయం సొంతం చేసుకున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో 253 పరుగులు చేశారు. ఓపెనర్ స్మృతీ మంధాన (51, 62 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించగా, మరో యువ ఓపెనర్ జెమీమా రొడ్రిగస్ (0) విఫలమైంది. హర్మన్ప్రీత్ కౌర్ (17), హేమలత (6)లు స్కోరు వేగం పెంచటంలో విఫలమయ్యారు. దీప్తి శర్మ (36, 44 బంతుల్లో 4 ఫోర్లు) ఆఖర్లో మిథాలీకి తోడుగా వేగంగా పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంక ఓపెనర్ జయంగణి (115), హాసిని పెరీరా (45)లు తొలి వికెట్కు 101 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. 49.5 ఓవర్లలో గెలుపు పరుగు తీసిన శ్రీలంక మూడో వన్డేలో విజయం సాధించింది. ఐసీసీ మహిళల చాంపియన్షిప్స్లో భాగంగా ఈ మ్యాచులు జరుగుతున్నాయి. ఈ విజయంతో శ్రీలంక రెండు పాయింట్లు సాధించింది.