Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : ఆసియా కప్ షెడ్యూల్పై పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టోర్నీలో పాల్గొనే అన్ని జట్లకూ ఒకేవిధమైన నిబంధనలు ఉండాలని అన్నాడు. ఆసియా కప్లో భారత్ తన అన్ని మ్యాచులను దుబారులోనే ఆడునున్నది. కానీ మిగతా జట్లు అబుదాబి, దుబారులలో ఆడుతున్నాయి. దీనిపై సర్ఫరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ' భారత్, పాకిస్థాన్ సహా జట్టు ఏదైనా రూల్స్ అందరికీ ఒకేలా ఉండాలి. షెడ్యూల్ చూస్తే భారత్ అన్ని మ్యాచులనూ దుబారులో ఆడుతోంది. టోర్నీల్లో ప్రయాణం చాలా కఠినం. దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆలోచన ఏమిటో తెలియదు కానీ పీసీబీ దీనిపై స్పందిస్తుందని అనుకుంటున్నాను' అని సర్ఫరాజ్ అన్నాడు. ఇక ఒక్క రోజు విరామం లేకుండా భారత్ వరుసగా రెండు మ్యాచుల ఆడటంపై సునీల్ గవాస్కర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ఈ షెడ్యూల్ వెనుక ఆంతర్యం అర్థం చేసుకోవటం కష్టమని అభిప్రాయపడ్డాడు. కాగా, ఈ ఆసియా కప్ను బీసీసీఐ నిర్వహిస్తోంది. దుబారు స్టేడియంలో సామర్థ్యం ఎక్కువ కాబట్టి, వాణిజ్య విలువల దృష్ట్యా భారత్ మ్యాచులను దుబారులోనే షెడ్యూల్ చేశామని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.