Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూర్ : ఇండియన్ ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి వరుసగా మరో సీజన్లో బెంగళూర్ ఎఫ్సీకి సారథ్యం వహించనున్నాడు. గత సీజన్ టైటిల్ పోరులో చెన్నయిన్కు ట్రోఫీ కోల్పోయిన బెంగళూర్, ఈ సీజన్ ఆరంభ మ్యాచ్లో అదే ప్రత్యర్థితో వేట మొదలు పెట్టనున్నది. సెప్టెంబర్ 30 నుంచి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఆరంభం కానుండగా ఛెత్రిని తమ సారథిగా బెంగళూర్ ప్రకటించింది. గత సీజన్ జట్టులో నుంచి 12 మందిని అట్టిపెట్టుకున్న బెంగళూర్ ఈ సారైనా ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. స్టార్ గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సందూ సైతం బెంగళూర్ ఎఫ్సీలో ఉన్నాడు