Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి రౌండ్లో ప్రణరు ఓటమి
- సాత్విక్, అశ్విని జోడీ శుభారంభం
- చైనా ఓపెన్ సూపర్ సిరీస్
బీజింగ్ (చైనా): మాజీ వరల్డ్ నం.1, సూపర్ సిరీస్ టైటిళ్ల వేటగాడు కిదాంబి శ్రీకాంత్లో డ్రాగన్ గడ్డపై రెండో మేజర్ టైటిల్ దిశగా తొలి అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్లో బుధవారం జరిగిన తొలి రౌండ్ పోరులో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అలవోక విజయం సాధించాడు. 21-9, 21-19తో డెన్మార్క్ షట్లర్ను చిత్తు చేసిన శ్రీకాంత్ చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాడు. మరో స్టార్ ఆటగాడు హెచ్.ఎస్ ప్రణరు తొలి రౌండ్ నుంచే నిష్క్రమించాడు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, అశ్విని పొన్నప్ప జంట శుభారంభం చేసింది. తొలి రౌండ్లో స్ఫూర్తిదాయక విజయంతో తర్వాతి రౌండ్కు చేరుకున్నారు. ఇక మహిళల సింగిల్స్లో స్టార్ షట్లర్ పి.వి సింధు నేడు ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ ఆడనున్నది. థారులాండ్ చిన్నది బుసానన్తో సింధు క్వార్టర్స్ బెర్త్ కోసం పోరాడనున్నది.
కిదాంబి అలవోకగా.. : పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించాడు. డెన్మార్క్ షట్లర్ రాస్మస్ గెమ్కెపై అర గంటలోనే విజయం సొంతం చేసుకున్నాడు. తొలి గేమ్ను 21-9తో ఏకపక్షంగా నెగ్గిన శ్రీకాంత్కు, రెండో గేమ్లో డెన్మార్క్ ఆటగాడి నుంచి కాస్త పోటీ ఎదురైంది. 21-19తో రెండో గేమ్నూ నెగ్గిన శ్రీకాంత్ ప్రీ క్వార్టర్స్లో కాలుమోపాడు. హెచ్.ఎస్ ప్రణరు 16-21, 12-21తో ఎనిమిదో సీడ్ హాంగ్కాంగ్ ఆటగాడి చేతిలో వరుస గేముల్లో ఓటమిపాలయ్యాడు. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ జంటగా అశ్విని పొన్నప్ప శుభారంభం చేసింది. 21-13, 20-22, 21-17తో హోరాహోరీగా జరిగిన తొలి రౌండ్లో ఇంగ్లాండ్ జోడీ మార్కస్ ఎలీస్, లారెన్ స్మిత్లపై అశ్విని, సాత్విక్లు విజయం సాధించారు. 63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో గెలుపొందిన అశ్విని, సాత్విక్లు ప్రీ క్వార్టర్స్లోకి చేరుకున్నారు. మెన్స్ డబుల్స్లో చిరాగ్ శెట్టి తోడుగా బరిలోకి దిగిన సాత్విక్కు చుక్కెదురైంది. 19-21, 20-22తో మలేషియా జోడీ చేతిలో సాత్విక్, చిరాగ్లు పోరాడి ఓడారు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డిలకు రెండో రౌండ్కు బ్రేక్ పడింది. కొరియా షట్లర్ల చేతిలో మనోళ్లు 10-21, 18-21తో 32 నిమిషాల్లోనే మ్యాచ్ను కోల్పోయారు.