Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాపై 2 పరుగులతో ఉత్కంఠ విజయం
ఢాకా : కుర్రాళ్లు సైతం సీనియర్ల బాటలో నడుస్తున్నారు. ఆసియా కప్ టైటిల్కు అడుగు దూరంలో నిలిచారు. బంగ్లాదేశ్తో ఉత్కంఠ మ్యాచ్లో 2 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించిన భారత అండర్-19 కుర్రాళ్లు ఆసియా కప్ ఫైనల్లోకి ప్రవేశించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.3 ఓవర్లలోనే కుప్పకూలింది. యశస్వి చౌదరి (69 బంతుల్లో 37), సమీర్ చౌదరి (36), అనుజ్ రావత్ (35)లు ఆదుకున్నారు. స్వల్ప ఛేదనలో బంగ్లాదేశ్కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పేసర్ మోహిత్ జంగ్రా, స్పిన్నర్ సిద్దార్థ్ దేశారులు చెరో మూడు వికెట్లతో విజృంభించటంతో బంగ్లాదేశ్ 170 పరుగులకే పరిమితమైంది. మోహిత్, సిద్దార్థ్ల జోరుతో బంగ్లాదేశ్ 65/5తో ఓటమి లాంఛనం చేసుకున్నది. కానీ ఆరో వికెట్కు షమిమ్ హొస్సేన్ (59), అక్బర్ అలీ (45)లు ఆరో వికెట్కు 74 పరుగులు జోడించి ఉత్కంఠ రేపారు. ఆఖర్లో కట్టుదిట్టంగా బంతులేసిన భారత బౌలర్లు బంగ్లాదేశ్ను కుప్పకూల్చారు. 2 పరుగుల తేడాతో మెరుపు విజయం సాధించారు.