Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి ఎయిర్ హోస్టెస్
శ్రీలంక మాజీ కెప్టెన్, ప్రస్తుత పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ తనను లైంగికంగా వేధించాడంటూ ముంబయికి చెందిన ఓ ఎయిర్ హోస్టెస్ 'మీ టూ'తో తన అనుభవాన్ని పంచుకుంది. ముంబయిలోని ఓ హోటల్లో తనకు జరిగిన ఈ అనుభవం గురించి బుధవారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. 'కొన్నేళ్ల క్రితం క్రికెట్ మ్యాచ్లో భాగంగా టీమిండియా, శ్రీలంక జట్లు ముంబయిలోని జుహు సెంటార్ హోటల్లో దిగాయి. అక్కడకు వెళ్లి వాళ్ల వద్ద ఆటోగ్రాఫ్ తీసుకుందామని నా సహోద్యోగి కోరింది. దీంతో మేం అక్కడకు వెళ్లాం. శ్రీలంక క్రికెటర్ల వద్దకు వెళ్లగానే నాకు భయమేసింది. వాళ్లు మమ్మల్ని కూల్డ్రింక్స్ తీసుకోమని కోరారు. నేను అక్కడికి తీసుకెళ్లిన వాటర్ బాటిల్లోని నీళ్లను మాత్రమే తాగాను. వాళ్లు దాదాపు అక్కడ ఏడుమంది ఉన్నారు. మేం ఇద్దరమే. కానీ నాకు అక్కడ అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపించడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోదామని నా సహోద్యోగిని కోరాను. వారిలో కొంతమంది మమ్మల్ని హోటల్ వెనకవైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ శ్రీలంక క్రికెటర్ అర్జున రణతుంగ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా నడుము మీద చేయివేయబోయాడు. నేను అతడిని తప్పించుకుందామని ప్రయత్నించాను. ఆయన నన్ను కొట్టాడు. నేను పోలీసులతో చెప్పి పాస్పోర్ట్ రద్దు చేయిస్తానని బెదిరించాను. ఆయన వద్ద నుంచి తప్పించుకుని వచ్చి రిసెప్షన్లో ఫిర్యాదు చేస్తే 'ఇది మీ వ్యక్తిగత విషయం. మేం ఎలాంటి సహాయం చేయలేమని కరాకండిగా చెప్పేశారు' అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్టు వైరల్ అయ్యింది. అయితే దీనిపై ఇంతవరకు అర్జున్ రణతుంగ స్పందించలేదు