Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూత్ ఒలింపిక్స్
బుయోనస్ ఎరేస్: అర్జెంటీనాలో జరుగుతున్న తొలి యూత్ ఒలింపిక్స్లో భారత్కు గురువారం ట్రిపుల్జంప్లో కాంస్య పతకం దక్కింది. భారత్కు చెందిన యువ అథ్లెట్ ప్రవీణ్ చిత్రవేల్ ట్రిపుల్జంప్ నాల్గో, చివరి ప్రయత్నంలో 15.68 మీటర్ల దూరం కాంస్యం గెలిచాడు. 17ఏళ్ల యువ అథ్లెట్ రికార్డ్ 15.84మీ. అందుకోలేకపోయినా రెండు ప్రయత్నాల్లో 31.52మీటర్ల జంప్ చేయడం విశేషం. క్యూబాకు చెందిన అలెజాండ్రో (17.14మీ, 17.04మీ.)కు స్వర్ణం, నైజీరియాకు చెందిన ఒరిసెమియివా (16.38మీ, 15.51మీ.) రజిత పతకాలను గెల్చుకున్నారు.