Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టైటిల్ కోసం తైజుతో పోరు
- సెమీస్లో శ్రీకాంత్కు పరాభవం
- డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్
ఒడెన్సె : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మళ్లీ ఫామ్లోకి వచ్చింది. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ తర్వాత మళ్లీ స్థాయికి తగ్గ విజయం అందుకోని సైనా నెహ్వాల్ ఇప్పుడు సూపర్ సిరీస్ టైటిల్ ముంగిట నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఏకపక్ష విజయం నమోదు చేసిన సైనా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. నేడు జరిగే ఫైనల్లో వరల్డ్ నం.1 తైజు యింగ్తో సైనా అమీతుమీ తేల్చుకోనున్నది. ఆసియా క్రీడల సెమీఫైనల్లో తైజు యింగ్ చేతిలోనే ఓటమి చెందిన సైనా నెహ్వాల్ డెన్మార్క్ ఓపెన్లో ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నది. మరోవైపు పురుషుల సింగిల్స్లో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వరుస గేముల్లో ఓటమిపాలయ్యాడు. వరల్డ్ చాంపియన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో 16-21, 12-21తో పరాభవం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
సైనా అలవోకగా.. : ఇండోనేషియా షట్లర్ గ్రెగొరియా మరిస్కపై సెమీస్లో సైనా అలవోకగా విజయం సాధించింది. 30 నిమిషాల్లోనే ముగిసిన సెమీ సమరంలో 21-11, 21-12తో ఇండోనేషియా అమ్మాయిని చిత్తుగా ఓడించింది. తొలి గేమ్ నుంచే దూకుడుగా ఆడిన సైనా నెహ్వాల్ ఆరంభంలోనే 4-1తో ముందంజ వేసింది. 9-4, 11-5తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచింది. సైనా దూకుడుతో సెమీఫైనల్ సమరం ఏకపక్షంగా మారింది. 16-6తో తిరుగులేని ఆధిక్యం సాధించిన సైనా అదే ఊపులో తొలి గేమ్ గెల్చుకున్నది. రెండో గేమ్ను 13 నిమిషాల్లోనే ముగించిన సైనా మరింత దూకుడు ప్రదర్శించింది. 3-0తో సైనా జోరందున్నా ఇండోనేషియా షట్లర్ పోరాట పటిమతో 7-7తో సమవుజ్జీగా నిలిచింది. కానీ ప్రథమార్థం ముగిసే సరికి 11-8తో ముందంజ వేసింది. ద్వితీయార్థంలో 18-11తో దూసుకెళ్లిన సైనా రెండో గేమ్తో పాటు ఫైనల్స్ బెర్త్నూ సొంతం చేసుకున్నది.