Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడా మంత్రి రాథోర్కు ఐఓఏ వినతి
న్యూఢిల్లీ : ఇన్నాండ్లూ అధికారులకు మాత్రమే పరిమితమైన విదేశీ పర్యటనల బిజినెస్ తరగతి ప్రయాణ సదుపాయం ఇక నుంచైనా క్రీడాకారులకూ కల్పించాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ను కోరింది. యూత్ ఒలింపిక్ గేమ్స్లో పతకాలు సాధించిన యువ అథ్లెట్లను ఆదివారం ఇక్కడ ఐఓఏ నగదు ప్రొత్సాహకాలతో సత్కరించింది. స్వర్ణానికి రూ. 3 లక్షలు, రజతానికి రూ. 1.5 లక్షలు, కాంస్యానికి రూ. 1 లక్ష బహుమతి అందించింది. ఈ సందర్భంగా ఐఓఏ కార్యదర్శి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ' విదేశీ టోర్నీల సమయంలో అధికారులు బిజినెస్ తరగతి విమాన ప్రయాణం చేస్తుండటం చూస్తుంటాను. ఇదే సమయంలో క్రీడాకారులు ఎకానమీ క్లాస్ ప్రయాణంలో ఉంటున్నారు, ఇది కొంత ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అథ్లెట్లకు సైతం బిజినెస్ తరగతి ప్రయాణ సదుపాయం కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని క్రీడా మంత్రిని కోరుతున్నాం. అదే విధంగా రోజువారీ డైట్ అలవెన్స్ను రూ. 450 నుంచి రూ. 1000కి పెంచాలని కోరుతున్నాం. ఈ మార్పులు ఫలితాల్లో గొప్ప వ్యత్యాసం చూపిస్తాయని' రాహుల్ భట్నాగర్ అన్నారు.