Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశవాళీ సీజన్కు స్పిన్ పిచ్లు రూపొందించాలని రాష్ట్ర సంఘాలకు, క్యూరేటర్లకు బీసీసీఐ సూచించింది. గత ఐదారేండ్లుగా భారత క్రికెటర్లు ఇంటా, బయటా విదేశీ స్పిన్నర్లను ఎదుర్కొవటంలో ఇబ్బంది పడుతున్నారు. విదేశీ పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, దేశవాళీ మ్యాచుల్లో ఫలితాలు రాబట్టేందుకు 7-8 ఏండ్ల క్రితం బీసీసీఐ పేస్ పిచ్లకు మారింది. కానీ స్పిన్ ఆడటంలో భారత క్రికెటర్ల సహజ నైపుణ్యం లోపిస్తున్న కారణంగా, తిరిగి స్పిన్ పిచ్లనే రూపొందించాలని క్యూరేటర్లకు చెబుతోంది. స్పిన్ పిచ్ల లేమితో యువ క్రికెటర్లు తిరిగే బంతిపై ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఢిల్లీ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ నిరుడు అనిల్ కుంబ్లే (బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్) దృష్టికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.