Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, నారంగ్భువనేశ్వర్ : క్రీడా రంగంలో మౌళిక వసతుల కల్పనలో ఒడిశా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే భారత హాకీకి చిరునామాగా మారిన ఒడిశా.. ఇతర క్రీడల్లోనూ వేగంగా అభివృద్ది చెందేందుకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దిగ్గజ క్రీడాకారులు అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్లు ఒడిశా క్రీడోద్యమంలో పాలుపంచుకోనున్నారు. హాకీ ప్రపంచకప్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కుంబ్లే, నారంగ్, గోపీచంద్లు భువనేశ్వర్లో అకాడమీలు ఏర్పాటు చేస్తామని ప్రకటిచారు. అనిల్ కుంబ్లేకు చెందిన టెన్విక్ స్పోర్ట్స్ సంస్థ, కెజెఎస్ ఆహ్లూవాలియా గ్రూప్ వెయిట్ లిఫ్టింగ్ హై పర్ఫార్మెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయన్నుది. దాల్మియా సిమెంట్ (భారతీ సిమెంట్)తో కలిసి పుల్లెల గోపీచంద్ ఇక్కడ బ్యాడ్మింటన్కు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నాడు. రిలయన్స్ గ్రూప్ అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా హై పర్ఫార్మెన్స్ కేంద్రాన్ని నెలకొల్పనున్నది. ఒలింపిక్ విజేత గగన్ నారంగ్ ఒడిశాలో షూటింగ్ అకాడమీకి ముందుకొచ్చాడు.