Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన టోర్నీకి కశ్యప్ అర్హత
- హాంగ్కాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్
హాంగ్కాంగ్ : కామన్వెల్త్ క్రీడల మాజీ చాంపియయన్, మాజీ వరల్డ్ నం.6 పారుపల్లి కశ్యప్ హాంగ్కాంగ్ ఓపెన్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించాడు. భారత బ్యాడ్మింటన్లో మెన్స్ సర్క్యూట్లో స్టార్ ఆటగాడిగా ఎదిగిన కశ్యప్ వరుస గాయాలతో కొంతకాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ చాలెంజర్ నెగ్గినా, మళ్లీ గాయంతో లయ కోల్పోయాడు. తాజాగా హాంగ్కాంగ్ ఓపెన్ అర్హత రౌండ్లో చైనీస్ తైపీ షట్లర్పై విజయం సాధించాడు. 21-7, 12-21, 21-18తో సు జెన్ హోపై మూడు గేముల్లో గెలుపొందాడు. ప్రధాన టోర్నీ తొలి రౌండ్లో ఇండోనేషియా షట్లర్ అంటోనితో కశ్యప్ తలపడనున్నాడు. మిక్స్డ్ డబుల్స్లో అశ్విని పొన్నప్ప, సాత్విక్సాయి రాంకీ రెడ్డి శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ పోరులో మూడు గేముల పోరాటంలో అశ్విని, సాయి నెగ్గారు. 21-16, 19-21, 21-14తో టోర్నీలో ముందంజ వేశారు. మహిళల సింగిల్స్లో పి.వి సింధు, సైనా నెహ్వాల్లు, పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్ ప్రణరు, సాయిప్రణీత్లు నేడు తొలి మ్యాచ్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు.