Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది ప్రదర్శనపై గోపీచంద్
ముంబయి : భారత బ్యాడ్మింటన్కు ఈ ఏడాది కఠినంగా సాగిందని జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వ్యాఖ్యానించాడు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సిటీ స్థాయి మల్టీ స్పోర్ట్స్ ప్రాంఛైజీని ఆరంభించిన గోపీచంద్ మీడియాతో మాట్లాడారు. ' ఓవరాల్గా ఈ ఏడాది మాకు కఠినంగా సాగింది. కొన్ని టోర్నీలకు సన్నద్దమయ్యేందుకు సమయమే లేదు. కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు సహా ప్రపంచ చాంపియన్షిప్స్లో ఆశించిన పతకాలు సాధించాం. కానీ సూపర్ సిరీస్ల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. అయినా, మహిళల సింగిల్స్లో పి.వి సింధు, పురుషుల సింగిల్స్లో కిదాంబి శ్రీకాంత్ టాప్-10లో నిలిచారు. ఈ ఏడాది జరిగిన మేజర్ టోర్నీల్లో మెరుగ్గా రాణించాం. నూతన షెడ్యూల్ ప్రకారం టాప్ ప్లేయర్లు కచ్చితంగా కొన్ని టోర్నీల్లో ఆడాల్సి వస్తోంది. పని ఒత్తిడి దృష్ట్యా టాప్ షట్లర్లు ఎంపిక చేసుకునే టోర్నీల్లో ఆడితే బాగుంటుంది. ఈ సీజన్లో శ్రీకాంత్ వరుసగా కొందరి షట్లర్ల చేతిలోనే ఓటమిపాలయ్యాడు. ఆ మ్యాచుల్లో పొరపాట్లను సరిదిద్దుకునే సమయం సైతం లేకుండా పోయింది. ఇవన్నీ రానున్న సీజన్లో పరిగణనలోకి తీసుకుని మెరుగైన ప్రదర్శనకు కృషి చేస్తామని గోపీచంద్ అన్నాడు. ఇక బీజీ షెడ్యూల్తో కూడిన బీబ్ల్యూఎఫ్ క్యాలెండర్కు తోడు ఒకే ఏడాదిలో ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనాల్సి రావటం సైతం ప్రభావం చూపిందని పరోక్షంగా గోపీచంద్ అన్నారు.