Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్లో కిదాంబికి చుక్కెదురు ొహాంగ్కాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్
హాంగ్కాంగ్ : 2018లో మరో టోర్నీలో టీమ్ ఇండియా పతక ఆశలకు తెరపడింది. హాంగ్కాంగ్ ఓపెన్లోనూ భారత షట్లర్ల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్లో నాల్గో సీడ్ కిదాంబి శ్రీకాంత్కు క్వార్టర్ఫైనల్లో అనూహ్య ఓట మి ఎదురైంది. ఎనిమిదో సీడ్ జపాన్ షట్లర్ తొలిసారి శ్రీకాంత్పై విజయం సాధిం చాడు. 17-21, 13-21తో నిషిమోట (జపాన్) శ్రీకాంత్పై రెండు గేముల్లో గెలు పొందాడు. తొలి గేమ్లో ఆఖరు వరకూ పోటినిచ్చినా శ్రీకాంత్ మెరువలేదు. మరో క్వార్టర్స్లో సమీర్ 15-21, 21-19, 11-21తో క్వాలిఫయర్ లీ చెక్ (హాంగ్కాంగ్) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్లో జపాన్ స్టార్ యమ గూచికి ఊహించని ఓటమి ఎదురైంది. 9-21, 16-21తో రచనాక్ ఇంటనాన్ (థారులాండ్) యమగూచిపై విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.