Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 35-23తో బెంగాల్ చిత్తు ొ ప్రొ కబడ్డీ సీజన్ 6
అహ్మదాబాద్ : ఇంటర్ జోన్ పోటీలో మరోసారి జోన్-ఏ పైచేయి సాధించింది. శుక్రవారం జరిగిన ఇంటర్జోన్ పోటీలో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ అలవోక విజయం సాధించింది. జోన్-బి జట్టు బెంగాల్ వారియర్స్పై 35-23తో సత్తా చాటి, 8 పాయింట్ల తేడాతో గెలుపొందింది. వారియర్స్పై దూకుడుగా ఆడిన గుజరాత్ 40 నిమిషాల పాటు ఆధిపత్యం చెలాయించింది. ప్రపంజన్ తొమ్మిది పాయింట్లు తీసుకురాగా, డిఫెండర్ పర్వేశ్ నాలుగు టాకిల్స్తో రాణించాడు. అజరు కుమార్ 6, డాంగ్ లీ 3 సైతం మెరువటంతో గుజరాత్ పని సులువైంది. అర్థ భాగం ముగిసేసరికి 19-14తో ఆధిక్యంలో నిలిచిన గుజరాత్, ద్వితీయార్థంలో అదే జోరు చూపించింది. వారియర్స్ తరఫున రైడర్ మణిందర్ సింగ్ ఆరు పాయింట్లు సాధించగా, రాణ్సింగ్ మూడు టాకిల్స్ చేశాడు. కొరియా ఆటగాడు జంగ్ కున్ లీ 5 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకుండా పోయింది. 35-23తో గుజరాత్ మెరుపు విజయం సాధించింది.