Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు కెనడాతో ఆఖరి లీగ్ మ్యాచ్
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నీలో భాగంగా భారతజట్టు ఆఖరి లీగ్ మ్యాచ్లో శనివారం కెనడాతో తలపడనుంది. టోర్నీలో భాగంగా గ్రూప్-సి తొలిమ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 5-0తేడాతో విజయం సాధించి శుభారంభం చేసిన భారతజట్టు అనంతరం బెల్జియం జట్టుతో తలపడిన మ్యాచ్ను 2-2తో డ్రా ముగించింది. దీంతో గ్రూప్-సిలో భారత్-బెల్జియం జట్లు 4 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. గోల్స్ పరంగా భారతజట్టు ఐదు గోల్స్తో ముందంజలో ఉండడంతో అగ్రస్థానంలో ఉంది. నేడు జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్లో కెనడాను ఓడించడమే గాకుండా ఎక్కువ గోల్స్ నమోదు చేస్తే టీమిండియా నేరుగా క్వార్టర్ఫైనల్కు చేరుతుంది. మరో మ్యాచ్లో మూడోర్యాంక్ బెల్జియం జట్టు దక్షిణాఫ్రికాతో ఆఖరి లీగ్మ్యాచ్ ఆడనుంది. బెల్జియం నేరుగా క్వార్టర్స్కు అర్హత సాధించాలంటే కనీసం ఐదు గోల్స్ వ్యత్యాసంతో గెలిచి, భారతజట్టు కెనడా చేతిలో ఓడితేనే బెల్జియంకు అగ్రస్థానం దక్కే అవకాశం ఉంది. శుక్రవారం జరిగిన మ్యాచుల్లో ఆస్ట్రేలియా జట్టు 11-0 గోల్స్ భారీ తేడాతో చైనాను, ఇంగ్లాండ్ 4-2తో ఐర్లాండ్పై గెలుపొందాయి. దీంతో గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా 9 పాయింట్లతో నేరుగా క్వార్టర్స్కు అర్హత సాధించగా... ఇంగ్లాండ్ 4 పాయింట్లతో రెండోస్థానంలో నిలవగా, చైనా, ఐర్లాండ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.