Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాణించిన భారత బౌలర్లు
అడిలైడ్: ఆసీస్ జట్టుపై భారత బౌలర్లు సమిష్టిగా రాణించారు. భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 88 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 191 పరుగులు మాత్రమే చేయగల్గింది. అంతకుముందు టీమిండియా 250 స్కోర్ వద్దే చివరి వికెట్నూ చేజార్చుకుంది. ఆసీస్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ హెడ్(61) పరుగులకే అజేయంగా క్రీజ్లో నిలిచి ఆతిథ్య జట్టును కష్టాల్లోంచి బయటపడేశాడు. భారత్ ఆలౌటైన అనంతరం తొలి ఇన్నింగ్స్ చేపట్టిన ఆసీస్ ఇషాంత్ శర్మ వేసిన మొదటి ఓవర్లోనే ఫించ్ వికెట్ను చేజార్చుకుంది. తొలి ఓవర్ మూడో బంతికి ఫించ్ బౌల్డ్ కావడంతో ఆతిథ్య జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. కాగా, మార్కస్ హారిస్-ఉస్మాన్ ఖ్వాజాల జోడీ ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 45 పరుగులు జత చేసిన తర్వాత హారిస్(26) రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్లో మురళీ విజరుకు క్యాచ్ ఇచ్చి హారిస్ వెనుదిరిగాడు. అటు తర్వాత స్పల్ప వ్యవధిలో షాన్ మార్ష్(2)సైతం అశ్విన్ బోల్తా కొట్టించడంతో ఆసీస్ 59 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మరో 28 పరుగుల వ్యవధిలో ఖ్వాజా(28) కూడా అశ్విన్ బౌలింగ్లో ఔట్ కావడంతో ఆసీస్ 87 పరుగుల వద్ద నాల్గో వికెట్ను నష్టపోయింది. అయితే హ్యాండ్స్కాంబ్-ట్రావిస్ హెడ్లు కుదురుగా బ్యాటింగ్ చేయడంతో తిరిగి ఆసీస్ గాడిలో పడ్డట్లు కనిపించింది. కానీ టీ విరామం తర్వాత ఆసీస్ స్కోరు 120 పరుగుల వద్ద ఉండగా హ్యాండ్స్కాంబ్ ఐదో వికెట్గా ఔటయ్యాడు. అటుపై కెప్టెన్ పైన్ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో ట్రావిస్ హెడ్తో జత కలిసిన ప్యాట్ కమ్మిన్స్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేశాడు. ఈ జోడీ 50 పరుగుల జత చేసిన తర్వాత కమిన్స్ను బూమ్రా ఎల్బీ చేశాడు. దాంతో ఆసీస్ 177 పరుగుల వద్ద ఏడో వికెట్ను చేజార్చుకుంది. వైపు ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు చేజార్చుకుంటున్నా ఆ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ ట్రావిస్ హెడ్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి హెడ్ 61, స్టార్క్ 8 పరుగులతో అజేయంగా ఉన్నారు. అశ్విన్ మూడు వికెట్లు చేజిక్కించుకోగా, బూమ్రా, ఇషాంత్లు తలో రెండు వికెట్లు తీశారు. రెండోరోజు భారత బౌలర్లు సత్తా చాటారు. తొలి ఇన్నింగ్స్లో 250 పరుగులకే పరిమితమైన భారత్ ఆ తర్వాత ఆతిథ్య ఆస్ట్రేలియాను కట్టడి చేసింది. ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 88 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఆసీస్ మిడిలార్డర్ బ్యాట్స్మన్ హెడ్ అర్ధసెంచరీతో రాణించి జట్టును కష్టాల్లోంచి ఒడ్డున పడేశాడు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్-250 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : ఫించ్ (బి) ఇషాంత్ 0, హర్రిస్ (సి) విజరు (బి) అశ్విన్ 26, ఖ్వాజా (సి) పంత్ (బి) అశ్విన్ 28, మార్ష్ (బి) అశ్విన్ 2, హ్యాండ్కోంబ్ (సి) పంత్ (బి) బుమ్రా 34, హెడ్ (బ్యాటింగ్) 61, పైన్ (సి) పంత్ (బి) ఇషాంత్ 5, కమ్మిన్స్ (ఎల్బి) బుమ్రా 10, స్టార్క్ (బ్యాటింగ్0) 8, అదనం 17. (మొత్తం 88 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు)