Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైజాగ్ : సొంతగడ్డపై తెలుగు టైటాన్స్ తొలి విజయం సాధించింది. జైపూర్ పింక్ పాంథర్స్పై 36-26తో పాయింట్ల తేడాతో నెగ్గిన టైటాన్స్ ప్రొ కబడ్డీ సీజన్6లో ఆరో విజయం నమోదు చేసింది. నిలేశ్ సాలుంకే , రాహుల్ చౌదరిలు 16 పాయిం ట్లతో మెరవగా, డిఫెండర్ అనిల్ కుమార్ కుమార్ నాలుగు ట్యాకిల్స్ చేశాడు. జైపూర్ జట్టులో దీపక్ హుడా పది పాయింట్లతో, అజింక్య పొవార్ 6 పాయింట్లతో ఆకట్టుకున్నారు. అంతక ముందు జరిగిన మరో మ్యాచ్లో యు ముంబా 31-20తో గెలుపొందింది. సిద్ధార్థ్ దేశారు 7 రైడింగ్లో మెరువగా.. డిఫెండర్లు సురెందర్ సింగ్ 4, ఫజల్ అట్రచలి 4, ధర్మరాజ్ చర్లతన్ 3లు బెంగాల్ను కట్టడి చేశారు. బెంగాల్ తరఫున మణిందర్ సింగ్(5), బల్దేవ్ సింగ్ (4)లు మెరిశారు.