Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్-5లోకి పుజారా
- ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబారు : ఆడిలైడ్ టెస్టులో అరుదైన విజయం సాధించిన టీమ్ ఇండియా ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ దూ కుడు ప్రదర్శిస్తోంది. చారిత్రక తొలి టెస్టు విజయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్తో భాగస్వామ్యం కాకపోయినా, ర్యాంకింగ్స్లో అతడి అగ్రస్థానానికి ఢోకా లేదు. బంతితో రెండో ఇన్నింగ్స్లో ప్రభావం చూపిన జశ్ప్రీత్ బుమ్రా కెరీర్ ఉత్తమ ర్యాంక్లో నిలిచాడు. ఆడిలైడ్లో ఆరు వికె ట్లు కూల్చిన బుమ్రా 33వ స్థానంలో నిలిచాడు. కెప్టెన్ కోహ్లి వరల్డ్ నం.1 నిలుపుకున్నా.. కివీస్ కెప్టెన్ కానె విలి యమ్సన్ దూకుడుగా వస్తున్నాడు. పాకిస్తాన్పై అబుదాబి టెస్టులో వరుసగా 89, 139 పరుగులు చేసిన విలియ మ్సన్ 37 రేటింగ్ పాయింట్లు సాధించాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో 900 ప్లస్ పాయింట్లు సాధించిన తొలి న్యూజిలాండ్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఆడిలైడ్ పేలవ ప్రదర్శనతో 15 పాయింట్లు కోల్పోయిన కోహ్లి 920 పాయింట్లతో ఉన్నాడు. ఆడిలైడ్ హీరో చతేశ్వర్ పుజారా టాప్-5లోకి ప్రవేశించాడు. 123, 71 వరుస ఇన్నింగ్స్లతో డెవిడ్ వార్నర్, జో రూట్లను వెనక్కి నెట్టిన పుజారా నాల్గో స్థానంలో నిలిచాడు. విలియమ్సన్ రెండో స్థానంలో ఉండగా, స్టీవ్ స్మిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.