Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంగారూ మాజీ కెప్టెన్ పాంటింగ్
మెల్బోర్న్ : 70 ఏండ్లలో తొలిసారి టీమ్ ఇండియా ఆసీస్ నేలపై తొలి టెస్టులో విజయం సాధించింది. 31 పరుగులతో ఆడిలైడ్లో అద్భుతం చేసిన కోహ్లిసేన 1-0తో రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. వేగానికి చిరునామా పెర్త్లో రెండో టెస్టు కావటంతో ఇది కచ్చితంగా కంగారూ జట్టుకు అనుకూలించే అంశమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ' భారత ఆటగాళ్ల కంటే మా ఆటగాళ్లకే పెర్త్ బాగా అనుకూలిస్తుందని నా అంచనా. అయితే ఆస్ట్రేలియా వేగంగా పుంజుకోవాలి. ఆడిలైడ్లో గ్రహించాల్సిన సానుకూలాంశాలు ఉన్నాయి. 30 పరుగులతో ఓడిన వేళ, కోహ్లిసేన ఏకపక్ష అయిపోదు. కానీ కచ్చితంగా గెలిచే సత్తా కోహ్లిసేనకు ఉంది. పెర్త్ కొత్త పిచ్ ఆస్ట్రేలియాకు బాగా అనుకూలిస్తుందని భావిస్తున్నాను' అని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇక ఆడిలైడ్లో 0, 11 పరుగులే చేసిన ఓపెనర్ అరోన్ ఫించ్కు పాంటింగ్ బాసటగా నిలిచాడు. 'సెలక్టర్లు, కోచ్, కెప్టెన్లు ఫించ్ను ఓపెనర్గా ఎంచుకున్నారు. అతడు ఓ టెస్టులో విఫలమైనంత మాత్రానా స్థానం మార్చాలని ఏమీ లేదు. అది వారి అత్యుత్తమ కూర్పు అయినప్పుడు మార్చాల్సిన అవసరం లేదు' అని పాంటింగ్ తెలిపాడు.