Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాడ్మింటన్ ప్రపంచ టూర్ ఫైనల్స్ సెమీస్కు
గ్వాంగ్జౌ (చైనా): బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు అదరగొడుతోంది. బుధవారం జరిగిన గ్రూప్-ఏ తొలిరౌండ్లో రెండోర్యాంక్ యమగుచిని సునాయాసంగా ఓడించిన సింధు గురువారం రెండో మ్యాచ్లో ప్రపంచ నంబర్ షట్లర్ తైవాన్కు చెందిన తై-జు-యింగ్కు షాక్ ఇచ్చింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో సింధు 14-21, 21-16, 21-18 పాయింట్ల తేడాతో తైజుపై గెలిచింది. దీంతో గ్రూప్-ఏలో రెండు వరుస విజయాలతో సింధు సెమీఫైనల్కు అర్హత సాధించింది. గత ఏడాది ఈ టోర్నీలో రన్నరప్గా నిలిచిన సింధు ఈసారి టైటిల్ రేసులో అందరికంటే ముందు నిలిచినట్లైంది. తొలి సెట్ను కేవలం 16 నిమిషాల్లోనే ఓడిన సింధు రెండో సెట్లో అనవసర తప్పిదాలు చేయక ఆ గేమ్ను గెల్చుకుంది. దీంతో ఇరువురు షట్లర్లు ఒక్కో సెట్ గెల్చుకొని 1-1తో సమంగా నిలిచారు. నిర్ణయాత్మక మూడోసెట్లో తొలుత 3-0తో తైజు ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత అదే ఆధిక్యతను కొనసాగిస్తూ 11-12కు సింధు ఆధిక్యతలోకి వచ్చింది. అనంతరం 16-13 ఆధిక్యతను సాధించిన సింధు గేమ్ను 21-18తో ముగించి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. సుమారు 62 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్ బ్యాడ్మింటన్ అభిమానుల్ని అలరించింది. ఇక, పురుషుల సింగిల్స్లో తొలి మ్యాచ్లో ఓడిన సమీర్ వర్మ గురువారం జరిగిన రెండో మ్యాచ్లో ఇండోనేషియా షట్లర్ టామి సుగియార్తోపై 21-16, 21-7 తేడాతో విజయాన్ని నమోదు చేసుకొని సంచలనం సృష్టించాడు.