Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్లో ఓడిన సమీర్ వర్మ
- బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్
గ్వాంగ్జౌ (చైనా): ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడ బ్ల్యూఎఫ్) వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ పివి సింధూ జోరు కొనసాగుతోంది. ఈ టోర్ని ఫైనల్లోకి సింధూ దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సెమీస్లో సింధు థాయిలాండ్కు చెందిన ఇంతనోన్ రచనోక్పై ఘన విజయం సాధించి తుది పోరుకు సిద్ధ మైంది. సెమీస్లో సింధూ 21-16, 25-23 స్కోరుతో వరుస గేమ్స్ల్లో విజయం సాధించింది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్లో వరసగా రెండో ఏడాది కూడా తుదిపోరుకు చేరుకుంది. గత ఏడాది ఈ టోర్నిలో సింధూ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలనే పట్టుదలతో ఉంది. కాగా ఈ టోర్నిలో పురుషుల విభాగంలో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్కు చెందిన సమీర్ వర్మ ఓటమి చవిచూశాడు. కాగా, ఇటీవల కాలంలో భారత బ్యాడ్మింటన్కు ఆశాకిరణంగా మారిన సింధూ ఈ టోర్నిలో తన సత్తా చాటింది. తన అద్భుతమైన ఆటతో 2018కు మరో గొప్ప ముగింపు ఇచ్చేందుకు ఒక అడుగుదూరంలో నిలిచింది. శనివారం సెమీస్ మ్యాచ్ 54 నిమిషాలపాటు హోరాహోరీగా సాగింది. ఒక్కో పాయింట్ కోసం సింధూ-రచనోక్ తీవ్రంగా పోరాడారు. ఫలితంగా సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. తొలి గేమ్ ఆరంభంలో ఇరువురు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. ఈ క్రమంలోనే చెరొక పాయింట్ను సాధిస్తూ 2-2, 4-4, 7-7 గా నిలుస్తూ వచ్చారు. ఆ సమయంలో సింధు విజృంభించి స్కోరును మూడు పాయింట్ల తేడాకు తీసుకుపోయింది. దాంతో సింధు 10-7 తో ఆధిక్యంలో నిలిచింది. ఇదే జోరును కడవరకూ కొనసాగించిన సింధు మొదటి గేమ్ను సొంతం చేసుకుంది. ఆపై రెండో గేమ్లో రచనోక్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. తొలుత 6-3 తేడాతో పైచేయి సాధించిన సింధు.. ఆ తర్వాత వరుస పాయింట్లు కోల్పోతూ వచ్చింది. దాంతో ఇరువురి మధ్య రెండు పాయింట్లు, పాయింట్ మాత్రమే ఆధిక్యం కొనసాగింది. అయితే ఎక్కడా అలసిపోని సింధు చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో గేమ్తో పాటు మ్యాచ్ను సొంతం చేసుకుంది. చివర్లో సింధు రిటర్న్ షాట్లకు కచ్చితమైన జవాబు ఇవ్వలేని రచనోక్ మ్యాచ్ను కోల్పోయింది. ఆదివారం జరిగే ఫైనల్స్లో సింధు జపాన్ క్రీడాకారిణి నొజోమి ఒకురహతో తలపడనుంది. కాగా, ఈ టోర్నిలో అంచనాలకు మించి రాణించిన భారత వర్ధమాన ఆటగాడు సమీర్వర్మ పోరాటం సెమీ ఫైనల్తో ముగి సింది. ఈ టోర్ని ప్రారంభంలో సమీర్ వర్మ గ్రూపు దశ దాటేదీ అనుమానంగా ఉంది. అయితే సమీర్ స్ఫూర్తిమంతమైన ఆటతీరు తో సెమీఫైనల్ వరకూ చేరుకున్నాడు. అయితే శనివారం సెమీస్లో ప్రపంచ నంబర్ టూ, చైనా క్రీడాకారుడు షి యుకితో పోరాడి ఓటమి చవిచూశాడు. హోరాహోరీగా జరిగిన సెమీస్లో 12-21, 22-20, 21-17 స్కోరుతో సమీర్పై షి యుకి విజయం సాధించాడు.