Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్ ప్రపంచకప్ కోచ్ పాంటింగ్
మెల్బోర్న్ : ఇంగ్లాండ్ వేదికగా జరుగనున్న 2019 ప్రపంచకప్ను ఆస్ట్రేలియా నిలుపుకుంటుందని కంగారూ వరల్డ్కప్ స్పెషల్ బ్యాటింగ్ కోచ్ రికీ పాంటింగ్ విశ్వాసం వెలిబుచ్చాడు. ' ప్రస్తుతానికి ఇంగ్లాండ్, భారత్లు రేసులో ముందున్నాయి. ఇంగ్లీష్ పరిస్థితులు ఆసీస్ ఆట తీరుకు సరిగ్గా సరిపోతాయి. డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టుతో చేరితే ఆస్ట్రేలియా సైతం భారత్, ఇంగ్లాండ్ మాదిరి బలమైన జట్టుగా మారుతుంది. ప్రపంచకప్ టైటిల్ను నిలుపుకోగలం' అని పాంటింగ్ పేర్కొన్నాడు.
పాక్ బోర్డుకు భంగపాటు : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి క్రికెట్ ఆస్ట్రేలియా ఝలక్ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో జరిగాల్సిన వన్డే సిరీస్లో రెండు మ్యాచులను లాహోర్లో నిర్వహించాలనే పీసీబీ ప్రతిపాదనను సీఏ తిరస్కరించింది. భద్రతా కారణాల రీత్యా 1998 నుంచి ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లటం లేదు. తాజాగా వెస్టిండీస్ మహిళలతో టీ20 సిరీస్కు ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్.. కంగారూ జట్టు వస్తే అంతర్జాతీయ క్రికెట్ పాక్లో అడుగుపెట్టినట్టు అవుతుందని భావించింది. కానీ సీఏ అందుకు ఏమాత్రం అంగీకరించలేదు. దీనిపై పీసీబీ అసంతృప్తి వ్యక్తం చేసింది.