Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో పోరాడి ఓడిన అమ్మాయిలు
- 3-0తో టీ20 సిరీస్ కివీస్ వశం
హామిల్టన్
వన్డే సిరీస్ ఉత్సాహం టీ20 సిరీస్లో కొనసాగించలేని అమ్మాయిలు వైట్వాష్ ఓటమికి గురయ్యారు. పొట్టి సిరీస్లో హ్యాట్రిక్ విజయం సాధించిన న్యూజిలాండ్ 3-0తో టీ20 సిరీస్ను సొంతం చేసుకున్నది. మరోసారి ఆఖరి బంతి వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్లో టీమ్ ఇండియా అవకాశాల్ని అందుకోవటంలో తడబడింది. 162 పరుగుల ఛేదనలో స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన (86, 62 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) భారీ అర్ధ సెంచరీతో చెలరేగింది. జెమీమా రొడ్రిగస్ (21), మిథాలీరాజ్ (24) మెరిసినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా.. మిథాలీరాజ్ , దీప్తి శర్మలు చెరో బౌండరీ కొట్టారు. చివరి బంతికి నాలుగు పరుగులు అవసరం కాగా, మిథాలీ ఒక్క పరుగే తీయగల్గింది. దీంతో భారత్ 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (2) మరోసారి విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. సోఫీ డివేన్ (72, 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు), సుజీ బేట్స్ (24), హనా రొవె (12), ఆమీ (31) రాణింటచంతో ఆ జట్టు 161 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను సోఫీ డివేన్ సొంతమయ్యాయి.