Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హామిల్టన్ ఛేదనపై కార్తీక్
న్యూఢిల్లీ : పొట్టి సిరీస్ నిర్ణయాత్మక హామిల్టన్ టీ20లో చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్ సహచర బ్యాట్స్మన్ కృనాల్ పాండ్యకు సింగిల్ రన్ నిరాకరించటం ఆన్లైన్లో పెద్ద దుమారమే రేపింది. నిదహాస్ కప్ ఫైనల్లో బంగ్లాపై కండ్లుచెదిరే ప్రదర్శనతో ఫినీషర్గా ప్రశంసలు అందుకున్న కార్తీక్, హామిల్టన్ ఓటమితో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ విషయంపై కార్తీక్ స్పందించాడు. ' 145/6 నుంచి కృనాల్, నేను బాగా ఆడాం. బౌలర్లను ఒత్తిడిలో పడేయటంలో మేం సఫలమయ్యాం. టార్గెట్ ముగిస్తామని విశ్వసించాం. నేను సింగిల్కు నిరాకరించినప్పుడు, నిజాయితీగా చెబుతున్నా కచ్చితంగా సిక్సర్ కొడతాననే నమ్మకంతో ఉన్నాను. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా మన సామర్థ్యంపై నమ్మకం ఉండాలి. ఇదే సమయంలో సహచర బ్యాట్స్మన్ సత్తాపై విశ్వాసం ఉంచాలి. ఆ సమయంలో నేను సింగిల్కు రాలేదు, ఆటలో ఇవన్నీ జరుగుతుంటాయి. కొన్ని సార్లు మనం బాగా ఆడతాం. మరికొన్ని సార్లు బౌలర్లు ముగిస్తారు. ఈ ఘనత టిమ్ సౌథికి దక్కుతుంది. ఆ ఒత్తిడిలో యార్కర్లను అద్భుతంగా సంధిం ఓచాడు. అతడు ఏ చిన్న పొరపాటు చేసినా, మా ఏం చేయగలమో అందరికీ తెలుసు' అని కార్తీక్ పేర్కొన్నాడు