Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆడేందుకు సైనా నిరాకరణ
గువహటి : 83వ జాతీయ బ్యాడ్మిం టన్ చాంపియన్షిప్స్ దేశంలో మౌళిక సదుపాయాల కల్పన వైఫల్యాల్ని ఎత్తి చూపింది. స్టార్ షట్లర్లు పాల్గొంటున్న టోర్నీలో ఉడ్ కోర్టులు కనీస ప్రమాణాలు అందుకోలేదు. దీంతో సైనా నెహ్వాల్ ప్రీ క్వార్టర్స్లో ఆడేందుకు నిరాకరించింది. గాయాల బారిన పడి ఫామ్ కోల్పోయిన సైనా.. ఇప్పుడిప్పుడే రాణిస్తోంది. మార్చి తొలి వారంలో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్షిప్ నేపథ్యంలో రిస్క్ తీసుకోలేనని సైనా తేల్చి చెప్పింది. అదే దారిలో కశ్యప్, సాయిప్రణీత్లు సైతం నిరాకరించారు. ప్రీ క్వార్టర్స్లో పి.వి సింధు 21-11, 21-13తో నాగ్పూర్ అమ్మాయి మాళవికపై గెలుపొంది. సింధు మ్యాచ్ తర్వాత కోర్టులో చాలా చోట్ల చెక్క పైకి తేలింది. ఇది ప్రమాదకరంగా ఉండటంతో సైనా బరిలోకి దిగలేదు. కోర్టుకు మరమ్మతులు చేయించిన తర్వాత ఆడేందుకు సైనా అంగీకరించింది.
మాజీ క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ప్రస్తుతం అసోం ముఖ్యమం త్రిగా ఉన్నారు. ప్రతిష్టాత్మక టోర్నీ నిర్వహిస్తున్నప్పుడు అసోం బ్యాడ్మింటన్ అకాడమీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్టులు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం విఫలమైంది. పెచ్చులు తేలిన కోర్టులపై ఎలా ఆడిస్తారని నెటిజన్లు విరు చుకుపడుతున్నారు. దీనిపై బ్యాడ్మింటన్ సమాఖ్య, అసొం ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.