Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిథాలి నంబర్ 5
- ఐసీసీ ఉమెన్స్ ర్యాంకింగ్లో..
న్యూఢిల్లీ: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మహిళా క్రికెటర్ల వన్డే ర్యాంకింగ్లనువిడుదల చేసింది. భారత ఓపెనర్ స్మతి మంధాన 774 రేటింగ్ పాయింట్స్తో టాప్గా నిలిచింది. వన్డే టీమ్ కెప్టెన్, మిధాలీ రాజ్ ఐదో స్థానం దక్కింది. రెండు,మూడు స్థానాల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఎలీసా పెరీ,మైగా లెనింగ్ నిలిచారు. సరైన ఫామ్లో ఉన్న భారత్ టీ20 టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ర్యాంకింగ్లో..19 స్థానానికి పడిపోయింది.
బౌలింగ్లో మూడో స్థానానికి గోస్వామి
బౌలింగ్లో అనుభవం ఉన్న భారత ఫాస్ట్ బౌలర్ గోస్వామి మూడౌa స్థానంలో నలించింది. ఈ జాబితాలో తొలి స్థానాన్ని ఆస్ట్రేలియాకు చెందిన మెగన్షాట్,రెండో స్థానంలో సనామీర్లు ఉన్నారు. దీప్తిశర్మ(38) పూనమ్యాదవ్(9) టాప్ టెన్లో చోటు దక్కింది...టాప్ 5 ఆల్రౌండర్గా సత్తా చాటిన వారిలో దీప్తి శర్మ ఐదోస్థానంలో ఉన్నారు. టీమ్ ర్యాంకింగ్లో టీమ్ ఇండియా మూడోస్థానంలో నిలిచింది. ఐసీసీ ఉమెన్ ఛాంపియన్షిప్ ఆధారంగా భారత్ ఏడు మ్యాచుల్లో ఐదింటిని తమ ఖాతాల్లో వేసుకున్నది. ఇంగ్లాండ్ మొదటి స్థానాన్ని చేజేక్కించుకున్నది.