Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో స్వర్ణాలు కైవసం
న్యూఢిల్లీ : ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్ నికత్ జరీనా, మీనాకుమారి దేవిలు చరిత్ర సృష్టించారు. బల్గేరియా రాజధాని సోఫియా లో జరిగిన స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో వీరిద్దరూ స్వర్ణాలను చేజిక్కించుకున్నారు. మంగళ వారం జరిగిన 51 కేజీల విభాగం ఫైనల్లో జరీనా 5-0తో ఐరిష్ మాంగోపై విజయం సాధించగా, 54 కేజీల విభాగంలో మీనాకుమారి 3-2 పాయింట్ల తేడాతో ఐరా విల్లిగాస్పై గెలిచి బంగారు పతకాలను గెల్చుకున్నారు. మీనాకుమారి గతేడాది కాంస్యం సంపాదించింది. మంజురాణి 48 కేజీల విభాగంలో జోషి గబుకో చేతిలో 2-3 పాయింట్ల తేడాతో ఓడి రజిత పతకానికే పరిమితమైంది. సోమవారం జరిగిన సెమీస్ పోటీలో బసుమతిరారు(64 కేజీలు), నీరజ్(60 కేజీలు), బార్గోహేయిన్(69 కేజీలు) విభాగంలో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. గతేడాది ఈ టోర్నీలో బరిలోకి దిగిన భారత్ రెండు స్వర్ణ పతకాలతో పాటు 11 పతకాలను గెల్చుకుంది.