Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సింగపూర్లోని ఆర్థిక వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు దైచీ సంస్థకు చెల్లించాల్సిన రూ.3,500 కోట్లను ఏ విధంగా చెల్లిస్తారంటూ రాన్బ్యాక్సీ మాజీ ప్రమోటర్లను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ప్రశ్నించింది. దైచీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ రంజన్ గొగొరు నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు సింగ్ సోదరులైన శివీందర్ సింగ్, మాల్వీందర్ సింగ్ను ప్రశ్నించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు. ఆర్థిక సలహాదారులను సంప్రదించిన తర్వాత సరైన ప్రణాళికను ఇవ్వాలని పేర్కొంది. '' ఈ అంశం కేవలం వ్యక్తుల గౌరవానికి సంబంధించే కాదు.. దేశ గౌరవానికి కూడా సంబంధించింది. మీరు ఫార్మా రంగంలో స్థానంలో ఉన్నారు. మీరు కోర్టులకు రావడం మంచిది కాదు. మార్చి 28వ తేదీన మీ సమగ్ర ప్రణాళిక సమర్పించండి. మీరు కోర్టుకు రావడం అదే చివరి సారి కావాలి'' అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.