Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవితకాల నిషేధంపై పున పరిశీలన చేయమని సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ఐపీఎల్ స్ఫాట్ ఫిక్సింగ్ కేసులో న్యాయస్థానంలో నిర్దోషిగా తేలినా, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జీవితకాల నిషేధంతో శ్రీకాంత్ పోటీ క్రికెట్కు దూరమయ్యాడు. ఆరు సంవత్సరాలుగా బీసీసీఐ నిర్ణయంపై పోరాడుతున్న కేరళ మాజీ స్పీడ్స్టర్ శ్రీశాంత్కు సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త ఆశలు మొగ్గ తొడిగాయి!. ' మూడు నెలల్లో బీసీసీఐ క్రమశిక్షణ సంఘం శ్రీకాంత్కు విధించిన జీవితకాల నిషేధాన్ని పున పరిశీస్తుంది. శ్రీకాంత్ వాదన చెప్పుకునేందుకు కమిటీ అవకాశం ఇవ్వాలి' అని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కెఎం జోసెఫ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అయితే, శ్రీశాంత్ను నిర్దోషిగా తేల్చిన దిగువ కోర్టు తీర్పుపై ఢిల్లీ పోలీసులు శ్రీకాంత్పై హైకోర్టులో మోపిన క్రిమినల్ అభియోగాలపై ఈ తీర్పు ఎటువంటి ప్రభావం చూపబోదని ధర్మాసనం స్పష్టం చేసింది. ' సుప్రీంకోర్టు తీర్పుతో జీవితానికి మరో జీవనధానం లభించింది. శిక్ష సమీక్ష కోసం బీసీసీఐ 90 రోజులు ఎదురుచూడకుండా, త్వరగా తేల్చుతుందని ఆశిస్తున్నాను. ఆరేండ్లుగా ఎదురుచూస్తు న్నాను. 42 ఏండ్ల వయసులో లియాండర్ పేస్ గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాడు. 36 ఏండ్ల వయసులో నేను ఎంతో కొంత క్రికెట్ ఆడగలను కదా!. సుప్రీం తీర్పుతో ఏప్రిల్లో జరిగే స్కాటిష్ లీగ్లో ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నాను' అని శ్రీశాంత్ పేర్కొన్నాడు.